సీబీఐకి డాక్టర్ సుధాకర్ అరెస్ట్ కేసు..!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దళిత డాక్టర్ సుధాకర్‌పై పోలీసుల దాడి,అరెస్ట్ ఘటన వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తూ.. సీబీఐ విచారణకు ఆదేశించింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి.. విచారణ జరిపి ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు.. గత విచారణ సమయంలో సుధాకర్‌ను హాజరు పరచాలని .. ఆదేశించింది. అయితే పోలీసులు సుధాకర్ చికిత్సలో ఉన్నారని చెబుతూ.. పోలీసులు హాజరు పర్చలేదు. దీంతో హైకోర్టు విశాఖ మెజిస్ట్టేట్ ను వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది. మేజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేసి.. హైకోర్టుకు సమర్పించారు. డాక్టర్ సుధాకర్‌ శరీరంపై గాయాలున్నాయని మెజిస్ట్రేట్ నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక మాత్రం వేరుగా ఉంది. దాంతో ఆ నివేదికను నమ్మడం లేదని స్పష్టం చేశారు. అందుకే సీబీఐ విచారణ చేయించాలని హైకోర్టు నిర్ణయించింది.

డాక్టర్ సుధాకర్ .. నర్సీపట్నం ఆస్పత్రిలో అనస్థీషియా వైద్యుడు. ఆయన కరోనా సమయంలో.. పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దాంతో ఆయనను సస్పెండ్ ఏపీ ప్రభుత్వం… పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత హఠాత్తుగా విశాఖలో డాక్టర్ సుధాకర్ ను పోలీసులు పెడరెక్కలు విరిచికట్టి.. చొక్కా లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కక్ష పూరితంగా చేసిన చర్య అన్న ఆరోపణలు వచ్చాయి. డాక్టర్ సుధాకర్‌ మానసిక ఆరోగ్యం బాగోలేదని.. డాక్టర్ ఓ తెల్ల కాగితం పై రాసి ఇవ్వడం ఆయనను.. ఆస్పత్రికి తరలించడం వివాదాస్పదమయింది. ఈ అంశంపై.. జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. దళిత సంఘాలు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా.. ఖండించాయి. విశాఖ పోలీసుల తీరు మొదటి నుంచి వివాదాస్పదమవుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై కూడా.. హైకోర్టు సీరియస్ అయింది. విశాఖ పోలీసులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చినా .. పోలీసు ఉన్నతాధికారులు తీసుకోలేదు. తాజాగా … ఈ సారి సీబీఐ విచారణకే ఆదేశించారు.

డాక్టర్ సుధాకర్ ను ఆస్పత్రిలో కూడా సుఖంగా ఉండనీయడం లేదని .. టీడీపీ నేతలు కొన్ని వీడియోలు విడుదల చేశారు. ఆయన బలవంతంగా రాయించుకుంటున్న దృశ్యాలను విడుదల చేశారు. ఈ పరిణామాలన్నింటితో… హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం కలకలం రేపుతోంది. గతంలో సీబీఐ.. గుంటూరు అర్బన్ ఎస్బీ పీహెచ్‌డీ రామకృష్ణపై.. అక్రమ నిర్బంధం కేసులో సీబీఐ విచారణకు ఆదేశించింది. అలాగే.. వైఎస్ వివేకా హత్య కేసును కూడా సీబీఐకి ఇచ్చింది. తాజాగా.. సుధాకర్ కేసును కూడా సీబీఐకి ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close