హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఎల్జీ పాలిమర్స్.. అయినా నో రిలీఫ్..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ .. ఎక్కడైనా రిలీఫ్ దొరుకుతుందేమోనని.. తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రాంగణాన్ని సీజ్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పటికిప్పుడు సంస్థను సీజ్ చేయడం ప్రమాదకరం అని వాదించి.. పరిమితంగా ముఫ్పై మంది సంస్థలోకి వెళ్లేలా అనుమతి తెచ్చుకున్నారు. అయితే.. సీజ్ చేయమని ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏ వాదనలనైనా ఎల్జీ పాలిమర్స్ సంస్థ …హైకోర్టు, ఎన్జీటీ ముందే వినిపించాలని స్పష్టం చేసింది.

ఎల్జీ పాలిమర్స్‌ను సీజ్‌ చేయాలని.. హైకోర్టు ఏకపక్షంగా ఆదేశించిందని తమ వాదన వినిపించుకోలేదని.. కంపెనీ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థపై ఇప్పటికే ఏడు రకాల విచారణ కమిటీలు విచారణ జరుపుతున్నాయని తాము ఎవరి ముందు అని హాజరు కావాలన్నారు. కంపెనీని ఇప్పటికిప్పుడు సీజ్ చేస్తే.. అందులో ఉన్న రసాయనాల వల్ల ప్రమాదం అని వాదించడం వల్ల.. కాస్త రిలీఫ్ లభించినట్లుగా తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ పై ఎన్జీటీ విచారణకు ఆదేశించింది. హైకోర్టు కూడా.. పలు రకాల ప్రశ్నలను సంధిస్తూ.. నోటీసులు జారీ చేసింది.

అలాగే కంపెనీని సీజ్ చేయమని ఆదేశించింది. నిజానికి అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా ముందుగా కంపెనీని సీజ్ చేస్తారు. ఎల్జీ పాలిమర్స్ కు మాత్రం.. అలాంటి కష్టం ఎదురు కాలేదు. దర్జాగా చరాస్థి అయిన పాలిస్టైరిన్ ను తరలించేశారు కూడా. ఈ తరుణంలో.. ఆ సంస్థ.. విచారణ కమిటీలను ఎదుర్కోకుండా.. సుప్రీంకోర్టు పిటిషన్లతో ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు మాత్రం.. విచారణలపై ఎలాంటి స్టే ఇవ్వకుండా.. ఎలాంటి వాదనలైనా ఎన్జీటీ… హైకోర్టు ముందు చెప్పుకోవాలని స్పష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close