మళ్లీ కన్నా వర్సెస్ వైసీపీ..! ఈ సారి భూకబ్జా ఆరోపణలతో రివర్స్ ఎటాక్..!

మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ కన్నా వార్ ప్రారంభమయింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా కన్నాను చూడకుండా.. ఆయననో ప్రభుత్వ వ్యతిరేక నేతగా మాత్రమే పరిగణించే వైసీపీ నేతలు తాజాగా భూకబ్జా ఆరోపణలు ప్రారంభించారు. దీనికి కారణం కన్నా లక్ష్మినారాయణ దేవాదాయ ఆస్తులు.. టీటీడీ భూములను ప్రభుత్వం అమ్ముతోందంటూ… కన్నా నిరాహారదీక్ష ప్రారంభించారు. హిందువుల ఆలయాల జోలికి రావొద్దని చాలా సార్లు చెప్పామని .. అయినా వినడం లేదని దీక్ష ప్రారంభిస్తూ మండిపడ్డారు. మంగళగిరి, అన్నవరం ఆలయ భూములు తీసుకునే ప్రయత్నం చేశారని .. బీజేపీ ఆందోళనతో వెనక్కి తగ్గి.. ఇప్పుడు ఏకంగా తిరుమల వెంకన్న భూములకే ఎసరు పెట్టారని విమర్శించారు.

టీటీడీ భూములు అమ్మే జీవో రద్దు చేయలేదని.. దేవుడిని కూడా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక చేసిన ప్రతి పని ప్రజలను మోసం చేసేదేనని ప్రజలను మభ్య పెట్టేందుకే జీవో ఇచ్చారని విమర్శలు గుప్పించారు. కన్నా విమర్శలపై వైసీపీ భిన్నంగా స్పందించింది. ఆలయ భూముల రక్షణ కోసం దీక్ష చేస్తున్నట్లుగా చెబుతున్న.. కన్నానే .. ఆలయ భూములు కబ్జా చేశారని.. ప్రతి ఆరోపణలు చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటాచలం భూములు 18 ఎకరాలు కబ్జా చేశారని.. వాటి గురించి త్వరలోనే బయట పెడతామని.. ఎమ్మెల్యే మల్లా విష్ణు హెచ్చరించారు. జగన్ హిందూ మతానికి వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారని.. మండిపడ్డారు. కన్నా లక్ష్మినారాయణపై వ్యూహాత్మకంగా కబ్జా ఆరోపణలు వైసీపీ నేతలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

ప్రత్యేకంగా నూజివీడు వెంకటాచలం భూముల గురించి చెప్పి.. త్వరలో బయటపెడతామని చెప్పడం ద్వారా.. ఈ అంశంపై మరో సారి మాట్లాడవద్దని.. బ్లాక్ మెయిల్ చేసినట్లుగా వైసీపీ నేతల విమర్శలు ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. వివిధ సందర్భాల్లో ప్రభుత్వంపై… కన్నా లక్ష్మినారాయణ విరుచుకుపడుతున్నారు. అలా విరుచుకుపడినప్పుడల్లా ఆయనపై టీడీపీ ముద్ర వేసి వైసీపీ నేతలు విమర్శలు చేసేవారు. ఇప్పుడు.. ఆయనపై కబ్జా ఆరోపణలు ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close