అమరావతి ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక..! ప్రభుత్వం వ్యూహం మారిందా..?

అమరావతిని ఎక్కడిక్కడ నిలిపివేసి.. ఏడాది దాటిపోయింది. స్మశానం.. ఎడారిగా తీర్మానించేసి కూడా.. చాలా కాలం అయింది. అక్కడ నిర్మాణాలు జరగడం లేదు. అప్పటి కాంట్రాక్టర్లు.. తెచ్చుకున్న ఇసుకను కూడా.. ఈ మధ్య తరలించుకుపోయారు. ప్రభుత్వం నిర్మాణ పనుల మీద సమీక్షలు ఎప్పుడో మానేసింది. అక్కడ భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనే కాన్సెప్ట్‌ మీద పని చేస్తోంది. అయితే.. హఠాత్తుగా.. రెండు రోజుల కిందట.. కొన్ని వర్గాల మీడియాకు ఓ సమాచారం వచ్చింది. అదేమిటంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాలపై సమీక్ష చేశారని… 70శాతం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయమని సూచించారని.. ఆ సమీక్ష సమావేశ లీక్ సారాంశం.

చివరికొచ్చిన నిర్మాణాలను పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం..!

అమరావతిలో నిర్మాణాల పూర్తి అనే మాట వస్తేనే.. చాలా ఎఫెక్టివ్ న్యూస్ వచ్చినట్లే. ఎందుకంటే.. ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే నిన్నామొన్నటి వరకూ లేదు కాబట్టి.. స్వయంగా సీఎం సమీక్ష చేసి.. నిర్మాణాలపై సమీక్ష చేశారని తెలిపే సరికి.. చాలా మందిలో ఉత్కంఠ ప్రారంభమయింది. ఏడాది కిందట… అధికారం చేపట్టినప్పుడు.. అమరావతిలో అంతా అవినీతే.. అవినీతిని వెలుగులోకి తెచ్చి… ఆ తర్వాత నిర్మాణాలు చేపడతామన్నారు. అప్పట్నుంచి అనేక మలుపులు తిరిగింది అమరావతి వ్యవహారం. ఏడాది తర్వాత అవినీతి వెలుగులోకి రాలేదు. పాత కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేదు. నిర్మాణాలు శిధిలమయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం… 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టిపెట్టినట్లు బయటకు సమాచారం పంపారు.

హఠాత్తుగా అమరావతిపై ప్రభుత్వ ఫోకస్ ఎందుకు..!?

అమరావతిలో 70 శాతం పూర్తయిన భవనాలను పూర్తి చేస్తే.. ఉద్యోగులందరికీ క్వార్టర్స్ లభిస్తాయి. ఎమ్మెల్యేల క్వార్టర్లు వస్తాయి. ప్రభుత్వం నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ లభిస్తాయి. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. వాటిని పూర్తి చేస్తే.. విశాఖను వైజాగ్ తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే.. అక్కడ మళ్లీ అన్నీ కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అమరావతిలో అన్నీ అందుబాటులో ఉంటే.. అక్కడకు ఎందుకు అన్న చర్చ వస్తుంది. అది రాకుండానే అమరావతిలో ఏమీ లేదు అని చెప్పడానికే.. నిర్మాణాలు నిలిపివేశారని అంటూంటారు. కానీ ఇప్పుడు మళ్లీ కడతామని అందరూ ఆశలు వదిలేసుకున్న తర్వాత ప్రభుత్వం సంకేతాలు పంపుతోంది.

విశాఖకు వెళ్లబోయే సీఎం ఇంటికి కోట్లతో మరమ్మత్తులెందుకు..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… మొదట్లో తన ఇంటి కోసం దాదాపుగా ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడానికి జీవోలు ఇచ్చారు. విశాఖకు రాజధానిని మార్చాలనుకున్న తర్వాత ఆ జీవోలను రద్దు చేశారు. కానీ ఇటీవలి కాలంలో.. మళ్లీ తన నివాసం కోసం… ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. వివిధ రకాల పనులు చేయించినట్లుగా జీవోలు వచ్చాయి. వీవీఐపీ ఇళ్ల ఖర్చు కోసం అని జీవోలు ఇచ్చినా.. అవి సీఎం ఇంటి కోసమేనని చెబుతున్నారు. అప్పుడు అపేసి.. ఇప్పుడు ఖర్చు పెడుతూండటం… అమరావతి నిర్మాణాలు చేయాలని అనుకోవడం.. మారుతున్న ప్రభుత్వ వ్యూహానికి సంకేతమా అన్న చర్చ జరుగుతోంది. ఏమిటనేది.. ముందు ముదు తీసుకోబోయే నిర్ణయాలతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close