సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు మొదటి విచారణలోనే… హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ సారి తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు ఖాయమని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం మొండి పట్టుదలకు మూల్యం చెల్లించుకున్నట్లయింది.

వాస్తవానికి గతంలోనే సుప్రీంకోర్టు ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. రంగులు తొలగించాలన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే.. ఆ తీర్పునూ.. ప్రభుత్వం మరో రకంగా అన్వయించుకుని రంగులకు కొత్త అర్థాలు చెబుతూ జీవో ఇచ్చింది. దానిపైనా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు… రాష్ట్ర ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలు చెప్పినా.. రంగులు తీసేయకుండా.. కొత్త కొత్త కారణాలు చెబుతూ… జీవోలు జారీ చేయడం.. కోర్టు ధిక్కరణగా పరిగణించింది. గత నెల ఇరవై ఎనిమిది లోపు రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు చేపట‌‌్టాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో సీఎస్ నీలం సహాని.. సహా సీనియర్ అధికారులు హైకోర్టు ముందు హాజరై.. క్షమాపణలు చెప్పారు. కోర్టును ధిక్కరించే ఉద్దేశం లేదని.. తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని చెప్పుకున్నారు. సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ వేశారు. ఇవాళ విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు.. సూటిగా రంగులు తీసేయాలలని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది. రంగుల విషయంలో ఏపీ సర్కార్.. అత్యంత పట్టుదలగా ఉంది. తమ పార్టీ రంగులు ఉండాల్సిందేనన్నట్లుగా కోర్టులను కూడా లెక్క చేయని పరిస్థితి ఏర్పడింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పు పైనా.. మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారంటే… ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. ఇప్పుడు కూడా.. సుప్రీంకోర్టు ఆదేశాల్ని ప్రభుత్వం పాటిస్తుందన్న నమ్మకం లేదని.. ఏదో దొడ్డిదోవ మార్గాన్ని ఎంచుకుని… మళ్లీ వివాదాస్పదం చేస్తుందన్న అభిప్రాయంతో … ఇప్పటి వరకూ జరిగిన పరిణమాల్ని బట్టి రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close