రజకులు, క్షురకులు, టైలర్లలకు “జగనన్న చేదోడు”..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా… రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ. పదివేలు అందించే పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు. దీనికి జగనన్న చేదోడు అని పేరు పెట్టారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్లను ఆదుకుంటానని.. వారికి ఏటా పదివేల సాయం చేస్తానని.. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందించనున్నారు. డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.

ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయింది. వాలంటీర్ల ద్వారా ఎంపిక చేశారు. వారి బ్యాంక‌ అకౌంట్లు ఇతర లాంఛనాలు పూర్తి చేశారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయస్తారు. 1,25,926 మంది టైలర్లు, 38,767 మంది నాయీబ్రాహ్మణులు, 82,347 మంది రజకులకు సాయం అందుతుంది. చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటారని ప్రభుత్వం ఆశిస్తోంది.

అయితే.. మూడు విభాగాల్లోనూ లబ్దిదారులు అతి తక్కువగా ఉండటం మాత్రం.. ఆయా వర్గాల వారిలో అసతృప్తికి కారణం అవుతుంది. రాష్ట్రం మొత్తం మీద టైలర్లు కేవలం 38వేల మంది ఉన్నట్లుగానే ప్రభుత్వం చెబుతోంది. అలాగే టైలర్లు లక్షా ఇరవై ఐదు వేల మంది రజకులు 82వేల మంది మాత్రమే ఉన్నట్లుగా లెక్క తేల్చడంతో.. ఆయా వర్గాల వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్మిక శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో… దాదాపుగా 70 శాతం మంది పథకానికి అనర్హులయ్యారని అంటున్నారు. ఈ నిబంధన మారిస్తే పథకం ఉద్దేశం నెరవేరుతుందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close