మీడియా వాచ్‌: ఈనాడులో 16 మందికి క‌రోనా?

ఈనాడులో క‌రోనా క‌ల‌క‌లం. ఏకంగా ఒకేసారి 16 మందికి క‌రోనా సోకిన‌ట్టు ఓ వార్త‌… మీడియా వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. సోమాజీగూడ‌లోని ఈనాడు ప్ర‌ధాన కార్యాల‌యంలో రాండ‌మ్‌గా 125 మందికి క‌రోనా టెస్ట్‌లు చేయిస్తే… అందులో 16 మందికి పాజిటీవ్ అని తేలింది. దాంతో.. యాజ‌మాన్యం షాక్‌కి గురైంది. ఈ ప‌ద‌హారు మంది ఎవ‌రెవ‌రితో కాంటాక్ట్స్‌లో ఉన్నారు? అనే విష‌యాన్ని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయిస్తున్నారు. ఈనాడు మ‌రో కార్యాల‌యం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉంది. ప్ర‌స్తుతానికి మేజ‌ర్ వ‌ర్క్ అంతా అక్క‌డి నుంచే జ‌రుగుతోంది. ఫిల్మ్‌సిటీ ఉద్యోగుల‌కు టెస్ట్ లు చేయిస్తే.. ఇంకెన్ని కేసులు బ‌య‌ట‌ప‌డ‌తాయో అని ఈనాడు యాజ‌మాన్యం భ‌య‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఫిల్మ్‌సిటీలోనూ 2 కేసులు న‌మోదైన‌ట్టు స‌మాచారం. కేవలం 125 మందికి, అందునా రాండ‌మ్ టెస్ట్ చేయిస్తే ఇన్ని కేసులంటే.. అంద‌రికీ టెస్టులు చేయిస్తే, ఇంకెన్ని కేసులు బ‌య‌ట‌ప‌డ‌తాయో అనే భ‌యం ప‌ట్టుకుంది. క‌రోనా భ‌యాల మ‌ధ్య రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్స్ ఆఫీసుల‌కు వెళ్ల‌డానికే భ‌య‌ప‌డుతున్నారు. కానీ యాజ‌మాన్యం మాత్రం వ‌రుస‌గా సెల‌వ‌లు తీసుకుంటున్న‌వాళ్ల‌పై సీరియ‌స్‌గా దృష్టి పెడుతోంది. వెళితే క‌రోనా భ‌యం. వెళ్ల‌క‌పోతే.. ఉద్యోగం పోతుందేమో అన్న ఆందోళ‌న‌. ఈ రెండింటిమ‌ధ్య బతుకు వెళ్ల‌దీస్తున్నారు ఈనాడు ఉద్యోగులు.
v

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close