అమరావతిలో బొత్స హడావుడి..! నిర్మాణాలు ప్రారంభిస్తున్నారా..?

రాజధానిగా అమరావతిని ఇప్పుడల్లా తరలించే పరిస్థితి లేదని ఓ వైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటనలు చేస్తూంటే.. మరో మంత్రి బొత్స.. అమరావతిలో కలియ తరిగేస్తున్నారు. దాదాపుగా పూర్తయిన భవనాలను.. మౌలిక సదుపాయలను పరిశీలించేస్తున్నారు. గత శనివారం ఆయన సీఆర్డీ కమిషనర్‌ను వెంట బెట్టుకుని కరకట్ట రోడ్ అంతా పరిశీలించారు. అది రెండు లైన్లు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఈ రోజు మంత్రి .. పలువురు అధికారుల్ని వెంట బెట్టుకుని .. భవనాలను.. పరిశీలించారు. అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు పెద్దిరెడ్డి ప్రకటన.. ఇటు బొత్స పనులకు.. ఎక్కడో రిలేషన్ ఉన్నట్లుగా.,.. అందరిలోనూ సందేహాలు ప్రారంభమయ్యాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను మార్చే క్రమంలో… ప్రస్తుతానికి ఓ అడుగు ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అమరావతిలో దాదాపుగా రూ. పదివేల కోట్ల విలువైన పనులు జరిగాయి. కొన్ని భవనాలు అందుబాటులోకి రాగా.. చాలా భవనాలు ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తే.. ఉద్యోగులకు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. జడ్జిలు.. ఇలా అందరికీ కావాల్సిన వసతి లభిస్తుంది. మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేస్తే.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. అయితే.. కొత్త ప్రభుత్వం వాటన్నింటినీ లైట్ తీసుకుంది. అక్కడ ఎలాంటి రాజధాని అవసరం లేదని డిసైడయి.. విశాఖకు వెళ్లిపోవాలని అనుకుంది. చట్టం.. న్యాయం.. రాజ్యాంగం.. అడ్డం వచ్చినా.. తనదైన పద్దతిలో తాము విశాఖకు వెళ్లిపోవాలనుకున్నారు కానీ.. మధ్యలో కరోనా వచ్చి అడ్డం పడింది. దానితో ఏలా డీల్ చేయాలో తెలియక.. ఈ పరిస్థితుల్లో తరలించడం సాధ్యం కాదు కనుక ప్రస్తుతానికి వెనక్కి తగ్గారేమో అని కొంత మంది ఆలోచన చేస్తున్నారు.

విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సరికి.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను తరలించాలని ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అలా అయితే రాగలమని.. తర్వాత అయితే.. పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న చర్చ జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదు. దీంతో.. ఈ ఏడాదికే.. అమరావతిలోనే కొనసాగించి.. తర్వాత చూద్దామన్న అభిప్రాయానికి వచ్చేసి ఉంటారని భావిస్తున్నారు. అందుకే.. దాదాపుగా పూర్తయిన భవనాలపై .. దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అమరావతి విషయంలో వెనక్కి తగ్గినట్లుగా ప్రకటనలు చేస్తుందో.. అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభించబోతున్న సంకేతాలు ఇస్తుందో..అధికారికంగా ప్రకటిస్తేనే కానీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close