ఢిల్లీకి వైసీపీ ఎంపీలు.. హైకోర్టుకు ఆర్ఆర్ఆర్..!

వైసీపీ ఎంపీలందరూ..స్పీకర్ ఓం బిర్లాను కలిసేందుకు వెళ్ళిన సమయంలో… వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు…హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని .. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తాను ఎక్కడా పాల్పడలేదని.. అయినా తనపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని రఘురామకృష్ణంరాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

జూన్ 29న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన పిటిషన్‌పై.. ఇంకా సమాధానం రావాల్సి ఉందని ఎంపీ పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తనపై చర్య తీసుకోవాలంటే.. క్రమశిక్షణా కమిటీ సమావేశం కావాలన్న నిబంధన పాటించలేదన్నారు. అయితే.. కరోనా కారణంగా.. అత్యవసర పిటిషన్లను మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. ఈ కారణంగా ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

అయితే.. రఘురామకృష్ణంరాజు.. చర్య తీసుబోతున్నారంటూ.. హైకోర్టుకు వెళ్లడం.. వైసీపీ వాళ్లను కూడా ఆశ్చర్య పరుస్తోంది. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం అంతిమం. వైసీపీ అయినా.. రఘురామకృష్ణంరాజు అయినా… స్పీకర్ ఓం బిర్లా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే. న్యాస్థానాలు కూడా… జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే రఘు రామకృష్ణంరాజు ఏ వ్యూహంతో… హైకోర్టులో పిటిషన్ వేశారనేది.. వైసీపీ నేతలకు కూడా అంతు చిక్కని అంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close