పాత సచివాలయం కూల్చివేత షూరూ..!

తెలంగాణ పాత సచివాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. కోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చిన .. మూడు, నాలుగు రోజుల్లోనే కూల్చివేత ప్రారంభమయింది. మంగళవారం ఉదయం.. పాత సచివాలయానికి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేసిన అధికారులు లోపల కూల్చివేత పనులు ప్రారంభించారు. గతంలోనే.. కూల్చివేత కోసం.. ఇతరులకు పనులు అప్పగించారు. అయితే కోర్టు కేసుల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు కోర్టులో క్లియర్ అయిన తర్వాత శరవేగంగా.. ప్రభుత్వం స్పందించింది. పాత సచివాలయంలో ఉన్న వాహనాలు.. ఇతర సామాన్లను.. రెండు, మూడు రోజులుగా తరలించారు. ఇప్పుడు కూల్చివేత ప్రారంభించారు.

పాత సచివాలయంలో ఏపీకి కేటాయించిన మూడు భవనాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని… తెలంగాణ సర్కార్‌కు బదలాయించేసింది. దాంతో వాటినీ కూలగొట్టనున్నారు. మొత్తాన్ని కూలగొట్టి.. చదును చేసి కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కొత్త భవనం కోసం.. కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. డిజైన్లను కూడా కరారు చేశారు. కాంట్రాక్టర్‌ను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగా.. కూల్చివేత పనులు వేగంగా పూర్తి చేసి.. తర్వాత అంతే వేగంగా.. కొత్త సచివాలయాన్ని నిర్మించాలని.. ప్రభుత్వం పట్టుదలగా ఉంది.

పాత సచివాలయం కూల్చివేత విషయంలో… కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత విపక్ష పార్టీలు కొత్త డిమాండ్ ను వినిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని.. రోగులకు అవసరమైన బెడ్లు లేవని… పాత సచివాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చాలన్న డిమాండ్లు చేస్తూ వస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా అదే చెప్పారు. కానీ.. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధపడలేదు. పట్టుదలతో కూల్చివేత ప్రారంభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close