మరో మూడు రోజులు స్టే..! కూల్చివేత.. ఆగితే సాగదు..!

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇచ్చిన స్టే ఆర్డర్స్‌ను.. హైకోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. కూల్చివేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కాపీని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల పాటు స్టే పొడిగిస్తూ.. పదిహేనో తేదీకి వాయిదా వేసింది. సచివాలయ కూల్చివేతపై.. మంత్రివర్గం జూన్‌ 30న నిర్ణయం తీసుకుందని … అడ్వకేట్ జనరల్ చెప్పిన సమయంలో.. దానికి సంబంధించిన పత్రాలు ఏవని ధర్మాసనం ప్రశఅనించింది. మంత్రివర్గ నిర్ణయం ప్రతిని సమర్పించకుంటే ఎలా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయంపై కనీసం ప్రెస్‌నోట్‌ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. దీంతో.. వెంటనే… వాటిని సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు.

గతంలో కూడా సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా పది పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు… సచివాలయం కూల్చివేతపై కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని చెబుతూ.. ఆ పిటిషన్లు కొట్టేసింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రభుత్వం… రాత్రికి రాత్రే.. కూలగొట్టడం ప్రారంభించింది. మళ్లీ అనూహ్యంగా.. కొత్తగా కూల్చివేతలపై పిటిషన్లు వేయడంతో.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పుడు.. ఏ కేబినెట్ నిర్ణయాన్ని తప్పు పట్టలేమని.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో.. అదే కేబినెట్ నిర్ణయం ఫిజికల్ కాపీని కోర్టు ముందు ఉంచాలని అడగడం ఆసక్తికరంగా మారింది.

మూడు రోజుల తర్వాత అయినా.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వస్తుందని.., తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరో వైపు సుప్రీంకోర్టులోనూ.. ఈ అంశంపై.. పిటిషన్ దాఖలయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. పిటిషన్ వేసి.. కూలగొట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు తీర్పుపై స్టే కోరారు. ఈ మూడు రోజుల్లో.. ఆ పిటిషన్ పై స్టే వచ్చినా… లేకపోతే.. పిటిషనర్.. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా.. ప్రభుత్వానికి… కూల్చివేత బుల్ డోజర్లకు మరికొంత కాలం విశ్రాంతి తప్పదని భావిస్తున్నారు. శరవేగంగా కూల్చివేత చేపట్టినా.. మధ్యలో ఆగిపోవడం… తెలంగాణ ప్రభుత్వ పెద్దలను బాగా ఇబ్బంది పెడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ రోడ్ షోలతో కూటమికి మరింత ఊపు !

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయడానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రానున్నారు. ఆయన టూర్ షెడ్యూల్‌ కూడా ఖరారైంది. చిలకలూరిపేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి...

ఎలక్షన్ ఎజెండా డిసైడ్ చేసిన రేవంత్ రెడ్డి

ఎన్నికలకు ఎజెండా డిసైడ్ చేసే పార్టీకే ఎక్కువ ఫలితాలు వస్తాయి. అలాంటి అజెండా డిసైడ్ చేయడానికి అందరూ ప్రయత్నిస్తారు. ఈ విషయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ముస్లిం రిజర్వేషన్ల...

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close