పార్టిసిపెంట్స్ కోసం వేట మొదలు పెట్టిన బిగ్ బాస్ 4.

ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా ఒక సీజన్ ను నుంచి మరొక సీజన్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు 4వ సీజన్ కోసం సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

సీజన్ 1 తో పోలిస్తే మూడవ సీజన్ కల్లా మూడు రెట్లు వ్యూయర్ షిప్ పెంచుకున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ లో కూడా ఇదే జోరు కొనసాగించే అవకాశముంది. సాధారణంగా జూన్ జూలై లోపు ప్రారంభం అవ్వాల్సిన బిగ్ బాస్ ఈసారి కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్ లాక్ కొనసాగుతుండడంతో షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ టీం జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. వ్యాఖ్యాతగా నాగార్జున తిరిగి కొనసాగుతున్నారు. మొదట్లో నాలుగవ సీజన్ కి నాగార్జున స్థానంలో ఇతరులు వస్తారని రూమర్లు వినిపించాయి. విజయ్ దేవరకొండ పేరు, సమంత పేరు కూడా వినిపించింది. అయితే ఫైనల్ గా నాగార్జునే సీజన్ 4 కూడా హోస్ట్ చేయబోతున్నాడని కన్ఫామ్ అయ్యింది.

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన శ్రద్ధా దాస్ 4వ సీజన్లో కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఇంతకుమునుపు సీజన్లలో కూడా ఆవిడ పేరు వినిపించింది. యాంకర్ లాస్య, వర్షిణి లలో ఒకరు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి ని సంప్రదించి నప్పటికీ, వీరిలో ఒకరు మాత్రమే ఫైనల్ అవుతారని సమాచారం. ఇక టీవీ9 ని నమ్ముకొని v6 ఛానల్ వదిలేసి వచ్చిన బిత్తిరి సత్తి కి ఇక్కడికి వచ్చాక పరిస్థితులు తారుమారు అయిన సంగతి తెలిసిందే. బిత్తిరి సత్తి కూడా బిగ్ బాస్ సీజన్ 4 లో కనిపించే అవకాశం ఉంది. బిత్తిరి సత్తి విషయంలో చర్చలు జరుగుతూఉన్నప్పటికీ ఫైనల్ డిసిషన్ పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు లో సీజన్ 4 ప్రసారమయ్యేలా చేయడం కోసం బిగ్ బాస్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. మరి మిగతా మూడు సీజన్ ల కంటే మించి నాలుగో సీజన్ హిట్ అవుతుందా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close