మంగళగిరి జర్నలిస్టులకు లోకేష్ బీమా..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టులు కూడా దీని బారిన పెద్ద ఎత్తున పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా జర్నలిస్టులను గుర్తించలేదు. వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఫలితంగా… కోవిడ్ బారిన పడుతున్న వారికి కనీస రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే ఏపీలో మొత్తం ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారెవరికీ కనీస మొత్తం పరిహారం కూడా అందలేదు. ప్రభుత్వం తక్షణం జర్నలిస్టులను ఆదుకోవాలనే డిమాండ్లు .. జర్నలిస్టు సంఘాలు వినిపిస్తున్నాయి. కనీసం రూ. 50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నాయి.

జర్నలిస్టు సంఘాల్లో అత్యున్నత స్థాయిలో పని చేసిన వారు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. జర్నలిస్టుల కష్టకష్టాలన్నింటినీ చూసిన వారూ ఉన్నారు. అయితే.. ఎవరూ ప్రభుత్వానికి ఈ దిశగా సలహాలు ఇవ్వడం లేదు. ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు. అయితే.. లోకేష్ ఇలా.. డిమాండ్ చేయడం మాత్రమే కాకుండా.. తన వంతు ప్రయత్నం కొత్తగా చేశారు. తాను ఇన్చార్జ్‌గా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ సొంతంగా బీమా చేయించారు. అన్ని మండలాలు కలిపి అరవై మందికిపైగా జర్నలిస్టులు ఉండటంతో.. వారందరికీ..ఇన్సూరెన్స్ చేయించారు. కరోనా మరణం సహా.. సహజమరణానికి రూ. పది లక్షలు.. యాక్సిడెంట్ అయితే.. రూ. ఇరవై లక్షలు వచ్చేలా ఈ బీమాను చేయించారు.

లోకేష్ ప్రయత్నం జర్నలిస్టుల ప్రశంసలకు కారణం అయింది. ప్రభుత్వం వద్ద..ఇప్పటికీ… కొన్ని ప్రతిపాదనలు పెండింగ్ లో ఉండిపోయాయి. కనీసం.. అక్రిడేషన్లను కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు.. ఉన్న అక్రిడేషన్లను పొడిగిస్తోంది కానీ..ఆ విషయం మాట వరుసకే చెబుతోంది. దీంతో.. ఆ అక్రిడేషన్ల వల్ల బస్ చార్జీల్లో రాయితీ కూడా లభించడంలేదు. హెల్త్ స్కీమ్.. ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ఫైళ్లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. లోకేష్.. మంగళగిరి జర్నలిస్టులందరికీ చేయించిన బీమా.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close