ఏపీ రాజధానిపై రంగంలోకి కేంద్రం..!?

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉన్నాయి. దీంతో ప్రధానమంత్రి కార్యాలయం.. ఆ బిల్లులకు సంబంధించిన పూర్తి వివరాలను పంపాలని రాజ్‌భవన్‌ను కోరినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో అమరావతికి మద్దతుగా.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా.., హిందూ సంస్థలు కూడా.. పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఆరెస్సెస్ సిద్ధాంత కర్తలు.. బహిరంగంగానే అమరావతికి మద్దతు తెలిపారు. అమరావతి ఆలయం కడతామని హిందూ మహాసభ కూడా ప్రకటించింది. అలాగే.. హిందూ మహాసభ.. జాతీయ ప్రధాన కార్యదర్శి.. ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు.

మూడు రాజధానుల నిర్ణయం చట్ట విరుద్ధమని.. అమరావతినే కొనసాగించాలన్న హిందూమహాసభ ప్రధాన కార్యదర్శి లేఖలో పేర్కొన్న మేరకు…అదనపు వివరాలు పంపాలని గవర్నర్‌కు పీఎంవో సూచించినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందే… హిందూ మహాసభ చేసిన ఫిర్యాదులపై అదనపు సమాచారాన్ని.. ఆ సంస్థ నుంచి.. పీఎంవో సేకరించినట్లుగా చెబుతున్నారు. చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎలా సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించామని హిందూమహాసభ నేతలు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై వివాదం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ కేంద్రం అసలు జోక్యం చేసుకోలేదు. కేంద్రానికి సంబంధించిన బీజేపీ నేతలు.. రాజధాని అంశం.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదని చెబుతున్నారు. ఏపీలో మాత్రం.. తాము అమరావతికే మద్దతిస్తామని చెబుతూ వస్తున్నారు. సుజనా చౌదరి లాంటి వాళ్లు కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని చెబుతున్నారు కానీ.. వెంటనే ఇతర నేతలు మాత్రం.. అలా జోక్యం చేసుకునే అవకాశం లేదనే మాట కూడా వినిపిస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య.. పీఎంవో.. వివాదాస్పద బిల్లులపై అదనపు సమాచారాన్ని కోరితే… అది అమరావతి ఉద్యమానికి కాస్త ఫలితం ఇచ్చినట్లే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close