ఆ విషయంలో విచారణకు ఆదేశించిన నిమ్మగడ్డ..!

స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో చేసిన వాస్తు మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఎవరు చెబితే ఆ మార్పులు చేశారో తనకు తెలియాలంటూ..విచారణకు ఆదేశించారు. నిమ్మగడ్డ తన ఆఫీసులో జరిగిన మార్పులపై విచారణకు ఆదేశించడానికి ఓ కారణం ఉంది. నిమ్మగడ్డ సోమవారం విజయవాడ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో.. ఓ వర్గం మీడియా.. ఆయన తన ఆఫీసుకు వాస్తు మార్పులు చేసుకున్నారని.. ఓ మార్గం మూసి వేశారని విస్తృత ప్రచారం చేసింది. ఆయన ఎలా మళ్లీ ఆ పదవిలోకి వచ్చారో .. న్యాయపోరాటంలో ఆయన సాధించిన విజయం గురించి ఒక్కటంటే.. ఒక్క ముక్క చెప్పకపోయినప్పటికీ.. ఆయనకేదో వాస్తు పిచ్చి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఆయన దృష్టికి వెళ్లడంతో… ఈ వాస్తు మార్పుల లెక్కేమిటో తేల్చాలనుకున్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి ఎస్ఈసీ రమేష్ కుమార్ ను….తొలగించిన తర్వాత…ఎన్నికల సంఘం కార్యదర్శిని మార్చారు. అలాగే…మధ్యలో ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చి..లాక్ డౌన్ టైంలో… జస్టిస్ కనగరాజ్ అనే వ్యక్తిని ఎస్ఈసీగా నియమించారు. ఆయన బాధ్యతలు తీసుకుని… సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఆయన చెన్నై వెళ్లిపోయినప్పటికీ… కార్యాలయంలో మాత్రం మార్పులు జరిగాయి. ఈ మార్పుల్ని… కార్యదర్శి చేయించారా… లేకపోతే.. కనగరాజ్ చేయించారా..అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

తాను ఏదో మార్పులు చేయించినట్లుగా… మీడియా ప్రచారం చేయడంతోనే.. ఎవరు మార్పులు చేయించారో బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తనకు సంబంధం లేకుండానే ఆ మార్పులు చేశారని నిమ్మగడ్డ చెబుతున్నారు. నిమ్మగడ్డ… వాస్తు లాంటి విషయాలను నమ్మరని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close