రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ సెక్యూరిటీ కింద.. పదకొండు మంది కేంద్ర బలగాలతో రక్షణ ఉంటుంది. ఒకరు లేదా ఇద్దరు కమాండోస్ వీరిలో ఉంటారు. రాష్ట్ర పర్యటనకు వస్తే.. వై కేటగిరి ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్ర బలగాలు రక్షణ కల్పించాల్సి ఉంటుంది.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. న్యాయస్థానాని.. ఇంటలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ రాగానే.. సెక్యూరిటీ కల్పిస్తామని… కేంద్రం హామీ ఇచ్చింది. ఇప్పుడు నివేదిక వచ్చిందో కానీ.. సెక్యూరిటీ కల్పించే దిశగా చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవలి రాజకీయ పరిణామాల్లో.. ఆయన వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దాంతో నర్సాపురంలో పర్యటిస్తే దాడులు చేస్తామని పలువురు వైసీపీ నేతలు హెచ్చరించారు.

నర్సాపురంలో దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఈ కారణంతో.. తన భద్రతపై ఆందోళనతో ఉన్నారు. గతంలో.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా.. వైసీపీ నేతలు అదే తరహాలో దాడులు చేస్తామన్నట్లుగా ప్రకటనలు చేశారు. దాంతో ఆయన కూడా.. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. తనకు కేంద్ర భద్రతా బలగాలతో రక్షణ కావాలని కోరారు. కేంద్ర హోంశాఖ ఆ మేరకు ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఇప్పుడు సొంత అధికార పార్టీకి చెందిన ఎంపీకి కేంద్రం భద్రత కల్పిస్తోంది. హోంశాఖ సహాయ మంత్రిషన్ రెడ్డి కూడా.. ఏపీలో పోలీసు రాజ్యం.. దౌర్జన్యం నడుస్తోందని ఏపీ పర్యాటకు వచ్చినప్పుడు విమర్శలు చేశారు. ఈ పరిణామాలన్నీ ఏపీలో శాంతిభద్రతలపై కొత్త సందేహాలు లేవనెత్తేలా చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close