జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి వెంకట్రావు హడావుడి చేయడంతో.. దీని వెనుక ఏదో మతలబు ఉందన్న చర్చ నడుస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఈ విషయంలో నేరుగా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే… జగన్మోహన్ రెడ్డికి చర్చి కట్టుకోవచ్చునని.. గుడి పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతీయవద్దని హెచ్చరించారు.

ఓ వైపు అయోధ్య రామాలయం శంకుస్థాపన ప్రత్యక్ష ప్రసారాన్ని ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వలేదు. దీన్ని కూడా రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వైసీపీ అధినాయకత్వంతో విబేధించి… బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్న రఘురామకృష్ణరాజు.. హిందూత్వ అజెండాను సమర్థిస్తున్నారు. అయోధ్య రామాలయ శంకుస్థాపనకు ఆయన ముందుగా మద్దతు తెలిపారు. విరాళం కూడా ఇచ్చారు. ఇప్పుడు… జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టడం అనే అంశంపై విమర్శలు ప్రారంభించారు. దీనికి హిందువుల మనోభావాలనే అంశాన్ని జోడించడం… ఆసక్తికరంగా మారింది.

జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు. ఆయన పక్కా క్రిస్టియన్. అందులో ఎలాంటి సందేహం లేదు . అయినప్పటికీ.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఏ ఉద్దేశంతో ఆయన గుడి కడుతున్నారో కానీ ప్రజల్లో విస్మయం వ్యక్తముతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు కనీసం వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ సౌకర్యాలు సరిగ్గా లేవనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో..ప్రజలను కరోనా నుంచి కాపాడారంటూ..జగన్ ను కీర్తిస్తూ గుడి కట్టేస్తున్నారు వెంకట్రావు. ఇదేం పద్దతన్న విమర్శలు వస్తున్నా వెనుకడుగు వేయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close