అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ నజర్..!

తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ 7నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలకు ఏర్పాటు చేసి.. కనీసం ఇరవై రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. సిద్ధం కావాలని మంత్రులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి. అయితే ిప్పుడు.. అన్‌లాక్ నిబంధనలు అమలు చేస్తున్నారు. వచ్చే నెల మొదటికి పూర్తిగా అన్‌లాక్ చేసే అవకాశం ఉంది. దీంతో ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సాధారణంగా వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌లోనే నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువ రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. పార్లమెంట్ సమావేశాలు కూడా అదే సమయంలో అటూ ఇటూగా జరుగుతూ ఉంటాయి. కరోనా అయినా.. మరో కారణం అయినా… వీటిని ఆపడానికి అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పద్దతుల్నైనా ఎంచుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే.. కోవిడ్ నిబంధనల ప్రకారం… భౌతిక దూరం పాటిస్తూ.. సీటింగ్ ఏర్పాటు చేసి.. సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమయింది. ఇప్పుడు కేసీఆర్ కూడా.. ఏడో తేదీన ముహుర్తం పెట్టుకున్నారు.

ఏపీ ప్రభుత్వం కూడా.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాల్సి ఉంది. అయితే.. ఎప్పటి నుంచి నిర్వహించాలన్నదానిపై ఎలాంటి ఆలోచనలు ఇంకా వెల్లడించలేదు. కరోనా కారణంగా.. భౌతిక దూరం పాటిస్తూ.. నిర్వహించాల్సిన సమావేశాల కోసం.. చాలా ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. మరి ఏపీ సర్కార్ ఆలోచనలు ఎలా ఉన్నాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close