అన్న‌య్య కోలుకుంటున్నారు: ఎస్‌.పి శైల‌జ‌

క‌రోనా బారీ ప‌డిన ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మణ్యం ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌స్తుతం కుదుట‌గా ఉంద‌ని సోద‌రి ఎస్‌.పి శైల‌జ తెలియ‌జేశారు. ”అన్న‌య్య కోలుకుంటున్నారు. మెల్ల‌గా స్పృహ‌లోకి వ‌స్తున్నారు. వెంటిలేట‌ర్ కూడా తొల‌గించారు. యూరిన్ కూడా సాఫీగా సాగుతోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న మ‌న‌మంద‌రి ముందుకు పూర్తి ఆరోగ్య‌వంతుడై వ‌స్తారు” అని ఓ వాయిస్ మెసేజీలో పేర్కొన్నారు. 12మందితో కూడిన‌ ప్ర‌త్యేక వైద్య బృందం బాలు ఆరోగ్య ప‌రిస్థితిని ప్ర‌తి క్ష‌ణం నిశితంగా గ‌మ‌నిస్తోంది. చెన్నై ప్ర‌భుత్వం సైతం.. బాలు ఆసుప‌త్రి ఖ‌ర్చులు భ‌రించ‌డానికి ముందుకొచ్చింది. పీఎమ్ ఆఫీసు నుంచి బాలు ఆరోగ్యం కోసం ఆరా తీస్తున్నారు. మొత్తానికి అభిమానుల పూజ‌లు, దీవెన‌లు ఫ‌లిస్తున్నాయి. బాలు కోలుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close