నేనే చెప్తా.. రూమ‌ర్లు న‌మ్మొద్దు: బాలు ఆరోగ్యంపై చ‌ర‌ణ్‌

క‌రోనా బారీ నుంచి ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోలుకున్నారని, తాజా ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు నెగిటీవ్ వ‌చ్చింద‌ని ఈరోజు ఉద‌య‌మే ఓ వార్త వినిపించింది. దాంతో బాలు ఆభిమానులు, సంగీతాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాలు కోలుకుంటున్నార‌ని, పూజ‌లు ఫ‌లిస్తున్నాయ‌ని భావించారు. కానీ.. అంత‌లోనే మ‌రో ట్విస్టు. “నాన్న‌గారి ఆరోగ్యం గురించి నేనే చెబుతా.. మీరు రూమ‌ర్లు న‌మ్మొద్దు“ అంటూ త‌న‌యుడు చ‌ర‌ణ్ ఓ వీడియో విడుద‌ల చేశారు.

“నాన్న‌గారి ఆరోగ్యం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు నేనే అప్ డేట్ ఇస్తూవ‌స్తున్నా. ఆయ‌న్ని ప‌ర్య‌వేక్షిస్తున్న డాక్ట‌ర్ల‌తో మాట్లాడిన త‌రవాతే.. నేను అప్ డేట్ ఇస్తున్నాను. అయితే ఈ రోజు ఉద‌య‌మే ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. నాన్న‌గారికి క‌రోనా నెగిటీవ్ అని ప్ర‌చారం మొద‌లైంది. అయితే.. నాన్న‌గారు ఆసుప‌త్రిలో చేరిన్ప‌పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఈ రూమ‌ర్లు న‌మ్మొద్దు. ఆయ‌న ఆరోగ్యంపై నేనే అప్ డేట్ ఇస్తుంటా“ అని క్లారిటీ ఇచ్చారు. దాంతో… క‌రోనాతో బాలు ఇంకా కోలుకోలేద‌ని, ఆయ‌న ఇంకా క‌రో్నాతో పోరాడుతున్నార‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది. అయితే. ఈరోజు ఉద‌య‌మే.. చ‌ర‌ణ్ పేరుతో మీడియాకి ఓ అప్ డేట్ అందింది. `నాన్న‌గారు క‌రోనాని జ‌యించారు` అన్న‌ది ఆ అప్‌డేట్ సారాంశం. అదెలా పుట్టిందో? ఎవ‌రు పుట్టించారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close