జీడీపీ, చైనా కాదు.. రియానే మీడియాకు పెద్ద సమస్య..!

మీడియా అంటే ఏమిటి..? దానిలో జాతీయ మీడియా అనే హోదా ఉంటే ఏం చేస్తారు..? ఈ రెండు ప్రశ్నలకు ప్రస్తుతం జాతీయ మీడియా సమాధానం ఇస్తోంది. మీడియా అంటే.. కేవలం ప్రజల్ని ఎంటర్‌టెయిన్‌ చేయడం… జాతీయ మీడియా అంటే… జాతీయ స్థాయిలో ఎంటర్‌టెయిన్‌ చేసే వారి వివరాలను హైలెట్ చేయడం.. ఈ అర్థాల ప్రకారమే.. జాతీయ మీడియా చెలరేగిపోతోంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లేవీ.. తమకు పట్టవని చెబుతూ.. రోజువారీ ప్రసారాలను పూర్తిగా రియా చక్రవర్తి చుట్టూ తిప్పేస్తున్నాయి. సొంత ఇన్వెస్టిగేషన్ చేసి.. శిక్షలు ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి.

సుశాంత్ సింగ్… ఆత్మహత్య ఘటన జరిగినప్పటి నుండి సోకాల్డ్ నేషనల్ మీడియాకు.. రియా తప్ప.. మరో వార్త కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో చైనా భారత్‌లో దురాక్రమణకు పాల్పడుతోంది. కాల్పులు కూడా జరిపింది. ఇది చైనా దుస్సాహసం. సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు ఉన్నాయి. కానీ.. మీడియా పట్టిచుకోవడం లేదు. అదే సమయంలో… దేశంలో ఆర్థిక పరిస్థితి ఆందోళన కరంగా మారింది. జీడీపీ మైనస్ 24 శాతానికి పడిపోవడం అంటే.. ఎంత ప్రమాదకరమో… దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో.. ఆర్థిక రంగంలో కామన్‌సెన్స్ ఉన్నవారికి తెలిసిపోతుంది. ఇలాంటి విషయాలను లైట్ తీసుకున్న మీడియా… రియా చక్రవర్తిని వేటాడటంలో బిజీగా ఉంది.

ఇప్పుడు రానున్న రోజుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకుని.. మీడియా చెలరేగబోతోంది. ఇప్పటికే రియా … నేషనల్ నార్కొటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో బాలీవుడ్ స్టార్ల పేర్లు చెప్పిందని.. ప్రచారం ప్రారంభించేశారు. రేపట్నుంచి వారికి నోటీసులు.. వీరికి నోటీసులు అని బ్రేకింగ్ న్యూస్‌లు వేసుకుని.. అర్థం పర్థం లేని అరుపులతో టైం పాస్ చేసేస్తారు. ప్రజలకు వినోదాన్ని పంచుతారు. కానీ..దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులపై… ప్రజలకు అవగాహన కల్పిస్తారు..? నిజాలు ఎవరు చెబుతారు..? సినిమా నటులపైనే కాన్‌సన్‌ట్రేట్ చేస్తే ఫోర్త్ ఎస్టేట్ అనే పదానికి అర్థం ఉంటుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close