రేవంత్ ఆతృతే కానీ కాంగ్రెస్ నేతలకు సోయి ఉంటుందా..!?

గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ ఎలా గెలవాలా అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసేసుకున్నారు. ఆయన సర్వేల పేరుతో ఎన్ని గెలుస్తామో కూడా చెప్పడం ప్రారంభించారు. మరో వైపు కేటీఆర్… భాగ్యనగరాన్ని హామీలతో ముంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… కాంగ్రెస్ పార్టీ .. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి.. మల్కాజిగిరి ఎంపీగా ఆ బాధ్యత తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం.. తమ సహజసిద్ధమైన రాజకీయాల్ని మార్చుకోవడం లేదు. సమావేశాలలో బాహాబాహీకి దిగుతున్నారు.

గ్రేటర్ ఎన్నికలపై.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి… రాజకీయ వ్యూహాలను వివరించారు. ఏం చేయాలో.. ఎలా చేయాలో చెప్పారు. టీఆర్ఎస్ ఎలాంటి అడ్డదారులు తొక్కబోతోందో వివరించి.. వాటిని ఎదుర్కోవాలన్నారు. తక్కువ ఓట్లతో డివిజన్లు ఏర్పాటు చేశారని.. బోగస్ ఓట్లు వేయించేడం వంటి చర్యలకు పాల్పడేందుకు ప్రణాలికలు వేస్తున్నారని పార్టీ నేతలకు వివరించారు. ఓల్డ్ సిటీలోని డివిజన్లలో 15 నుంచి 30 వేల ఓట్లు ఉంటే ఇంకో దగ్గర 70, 80 వేలు ఓటర్లు ఉన్నారు. డిలిమిటేషన్ చేసేప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో లీగల్‌గా ఎప్పటికప్పుడు అప్రోచ్ కావడానికి లీగల్ టీమ్ సిద్ధంగా ఉండాలని సూచించారు. 150 డివిజన్లలో ముఖ్య నాయకులను గుర్తించి గడప గడపకు పాదయాత్ర చేసి వాళ్ళను నామినేట్ చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రతి డివిజన్లలో డివిజన్‌కి మేనిఫెస్టో ప్రకటించాలని.. ఇలా.. చాలా చాలా ఆలోచనలు చెప్పారు.

అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం.. మొత్తం ఎజెండాను మార్చేసుకున్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం ప్రారంభించారు. శ్రవణ్, నిరంజన్.. ఒకరిపై ఒకరు దూసుకెళ్లి బూతులు తిట్టుకున్నారు. ఎవరి ఆధిపత్యం కోసం వారు ప్రయత్నించడంలో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తిట్టుకోవడం అయిపోయాక.., పీసీసీ చీఫ్ ఉత్తమ్ సర్దిచెప్పారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్ తీరు మారదని.. మీడియా ద్వారా ప్రజలకు స్పష్టత వచ్చింది. రేవంత్‌ది కంఠశోషగానే మిగిలిపోయింది. ఇలాంటి అనైక్యతతో .. టీఆర్ఎస్‌పై పోరాటం చేయడం సాధ్యం కాదనేది.. రాజకీయాలపై అవగాహన ఉన్నవారు చెప్పేమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close