పదే పదే ఆస్పత్రిలో చేరిక..! అమిత్ షాకు ఏమైంది..?

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అనారోగ్యం వీడటం లేదు. ఆయనకు పదే పదే శ్వాస సమస్యలు తిరగబెడుతున్నాయి. దీంతో మరోసారి ఆయన ఎయిమ్స్‌లో చేరాల్సి వచ్చింది. శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో శ్వాస పీల్చడం ఇబ్బంది అనిపించడంలో ఎయిమ్స్‌లో చేరిపోయారు. నిజానికి ఆయన గత వారమే ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగస్టు రెండో తేదీన అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందారు. రెండు వారాల చికిత్స తర్వాత ఆయనకు నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు.

మళ్లీ ఆగస్టు పద్దెనిమిదో తేదీన తెల్లవారుజామున ఆయన ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో శ్వాస సమస్య ఏర్పడటం.. ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అమిత్ షాకూ అవే లక్షణాలు ఉండటంతో ముందు జాగ్రత్తగా ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ నుంచే విధులు నిర్వహించారు. దాదాపుగా రెండు వారాల పాటు.. వైద్యల పర్యవేక్షణలో ఉన్న ఆయన పూర్తిగా కోలుకోవడంతో గత వారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. మళ్లీ సమస్య తిరగబెట్టడంతో ఎయిమ్స్‌లో జాయినయ్యారు.

కరోనా వైరస్ ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చికిత్స తర్వాత వైరస్‌ను శరీరం నుంచి బయటకు పంపేసినా… ఆ ప్రభావం మాత్రం కొనసాగుతోందని అంటున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ఇది మరింత ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం అమిత్ షా.. ముందస్తు జాగ్రత్తలు.. పర్యవేక్షణ కోసమే… ఆస్పత్రిలో చేరారని.. ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close