కోడెల వర్థంతి చేయకూడదని పోలీసుల నోటీసులు..!

ఓ వైపు వైసీపీ నేతలు ఆసరా వారోత్సవాలు అని సభలు సమావేశాలు పెట్టి.. పిల్లల్ని పెద్దల్ని పోగేసి డాన్సులు చేస్తున్నారు. పోలీసులకు అప్పుడు కోవిడ్ నిబంధనలు గుర్తు రావడం లేదు. కానీ ఇతరులు మాత్రం ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నారని తెలిస్తే పోలీసులు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే నోటీసులతో వారి వద్దకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతల విషయంలో అయితే జెట్ స్పీడ్‌గా పని చేస్తున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని ఎడాది గడిచింది. ఈ సందర్భంగా…బుధవారం ప్రథమ వర్థంతి జరగనుంది. ఇందు కోసం నరసరావుపేటలోని తన ఇంటి వద్ద కోడెల కుమారుడు శివరాం ఏర్పాట్లు చేసుకున్నారు.

సత్తెనపల్లి,నర్సరావు పేట నియోజకవర్గాల్లో పలు చోట్ల కోడెల అభిమానులు కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కోవిడ్ నిబంధనలు గుర్తు చేస్తూ కోడెల శివరాంకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని అందులో హెచ్చరించారు. నిర్వహించబోతోంది పార్టీ కార్యక్రమం కాదని..కేవలం తన తండ్రి మొదటి వర్ధంతి అని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే.. కార్యక్రమాలు ఆపబోమని కోడెల శివరాం ప్రకటించారు.

కోడెల మృతి తర్వాత ఆయన కుటుంబసభ్యులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కోడెలపై కేసులు పెట్టి..పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ప్రభుత్వం.. చివరికి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోనీయడం లేదన్న ఆగ్రహం ..కోడెల అభిమానుల్లో వ్యక్తమవుతోంది. అమలు చేస్తే నిబంధనలు అందరికీ ఒకలానే అమలు చేయాలని… కొంత మందికే అమలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close