ఆర్కే పలుకు : రాజాఇళాంగో లాంటి జడ్జిలయితే జగన్‌కు ఓకేనా..!?

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం.. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు పార్లమెంట్ వంటి వేదికలపైల నుంచి న్యాయవ్యవస్థపై చేస్తున్న దాడి గురించి విశ్లేషించారు. మిగతా అంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే కానీ కొత్తగా.. ఓ సంచలనాత్మక విషయాన్ని వెల్లడించారు. అదే గతంలో హైకోర్టు జడ్జిగా జగన్‌కు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన జస్టిస్ రాజా ఇళాంగో ప్రస్తుతం.. జగన్ అధికారంలోకి రాగానే ఓ ప్రభుత్వ పదవిని పొంది.. జీతభత్యాలు పొందుతూండటం. వ్యతిరేక తీర్పులు ఇస్తున్నారని అందరు న్యాయమూర్తులపై బురదచల్లేస్తున్న జగన్ అండ్.. ఈ మాజీ న్యాయమూర్తికి పదవి ఎందుకు కట్టబెట్టిందో.. దాని వెనుక ఏం జరిగిందో.. ఆర్కే పరోక్షంగా అయినా సంపూర్ణంగా విశ్లేషించారు.

న్యాయమూర్తిగా జస్టిస్ రాజా ఇళాంగో ఇచ్చిన తీర్పులన్నింటినీ ఆర్కే విశ్లేషించారు. అవినీతి కేసులలో జగన్మోహన్‌రెడ్డికి ఉపశమనం కలిగే విధంగా స్టేలు ఇచ్చారు. భారతి సిమెంట్ సంస్థ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తుచేసినప్పుడు .. రాజా ఇళంగో స్టే విధించారు. విజయసాయిరెడ్డి బంధువర్గానికి చెందిన హెటిరో ఫార్మా కంపెనీకి కూడా ఇటువంటి ఉపశమనాన్నే కల్పించారు. అవినీతి కేసులలో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది కూడా జస్టిస్ రాజా ఇళంగోనేనని ఆర్కే గుర్తు చేశారు. అన్ని రకాలుగా.. జగన్ కేసుల్లో ఆయన నుంచి సానుకూల తీర్పులు వచ్చాయి. ఇప్పుడు ఆయన రిటైరయ్యాడు. జగన్ అధికారంలోకి రాగానే ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్‌గా పదవి పొందారు.

ఇంత చెప్పిన ఆర్కే… జస్టిస్ రాజా ఇళాంగో తీరును ఒక్కరంటే.. ఒక్కరు కూడా ప్రశ్నించలేదని గుర్తు చేశారు. ఆయన పదవి పొందినప్పుడు కూడా విమర్శలు చేయలేదని… ఆయన తీర్పులకు ప్రతిఫలంగా పదవి పొందారని విమర్శలు చేయడానికి అవకాశం ఉన్నా.. నిగ్రహం పాటించాలని .. న్యాయవ్యవస్థలకు ఇతరులకు ఇస్తున్న గౌరవం అలాంటిదని.. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. అందుకు భిన్నంగా తనకు వ్యతిరేక తీర్పులిస్తే.. అందరి సంగతి చూస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆర్కే విశ్లేషించారు. రాజా ఇళంగోను అప్పట్లో మేనేజ్ చేశారనీ, ప్రతిఫలంగానే ఇప్పుడు పదవి ఇచ్చారనీ ఒక్కరైనా తప్పుబట్టకపోవడాన్ని ప్రజలు గమనించాలని నర్మగర్భంగా ఆర్కే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీయడం ఖాయమని చెప్పుకోవచ్చు.

ఈ వ్యవహారంలో ఆర్కే చాలా అంశాలను స్పృశించారు. టీడీపీ నాయకులు కేసులు ఎదుర్కోవడానికి భయపడుతున్నారని బేల తనాన్ని ప్రదర్శిస్తున్నారు. అక్కడ భూములు ఉండటమే నేరంగా పరిగణించి.. ముందు ముందు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు.. టీడీపీ నేతలపై ఏసీబీ కేసులు పెడుతుందని కూడా.. విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తప్పుడు కేసుల నుంచి న్యాయస్థానాలు కూడా టీడీపీ నేతల్ని కాపాడకుండా.. చేస్తున్న బ్లాక్‌మెయిలింగ్‌కు న్యాయవ్యవస్థ తలొగ్గకుండా స్వతంత్రంగా పని చేయగలుగుతుందా అనేది ఆర్కే సందేహం. ఈ బ్లాక్‌మెయిలింగ్ ఎక్కడి వరకు వెళ్తుందనేది.. ఆర్కే కూడా చెప్పలేకపోతున్నారు. మొత్తానికి జస్టిస్ రాజాఇళాంగో తీర్పులపై ప్రస్తుతం ఆర్కే చర్చ లేవనెత్తారు. గతంలో న్యాయమూర్తులకే లంచాలు ఇవ్వడానికి గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాళ్లు దొరికిపోయారు. ఆ సందర్భాలు ఆర్కే ప్రస్తావించలేదు కానీ.. అవన్నీ .. ఇప్పుడు చర్చల్లోకి రావాల్సిన అంశాలే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close