టీఆర్ఎస్ – బీజేపీ ఎంపీల “నిధుల” ఫైట్..!

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చింది..? ఎంత ఖర్చు పెట్టారు..? ఇప్పుడు ఇది బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీల మధ్య మాటల మంటలకు కారణం అవుతోంది. తెలంగాణలో కరోనా కట్టడికి రూ. 290 కోట్లు ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చారు. అంతకు ముందు రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ .. తెలంగాణకు కేంద్రం రూ. ఏడు వేల కోట్లు ఇచ్చిందని ప్రకటన చేశారు. ఈ రెండు ప్రకటనలను ఒకే ట్వీట్‌లో పెట్టిన కేటీఆర్… బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక బీజేపీ ఎంపీలు ఊరుకుంటారా..? రంగంలోకి దిగి.. విమర్శల వర్షం అందుకున్నారు.

కేటీఆర్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ.. మొదట విమర్శల వర్షం అందుకున్నారు. బండి సంజయ్ చెప్పింది.. కరోనా సమయంలో… కేంద్రం తెలంగాణ అందించిన సాయం వివరాలని.. ఒక్క కరోనా కట్టడికి మాత్రమే కాదని..అరవింద్ ప్రకటించారు. ఈ వివరాలను చెప్పకుండా కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కాలంలో పీఎం కిసాన్‌ , జనధన్‌ , ఉజ్వల పథకం , భవన నిర్మాణ కార్మికులకు సాయం, పెన్షన్లు, ఉపాధి హామీ పథకం, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆహార భద్రత పథకం కింద మొత్తం ఇచ్చిన నిధుల వివరాలను బండి సంజయ్ వెల్లడించారు. అంతే కాదు.. కరోనా కట్టడి కోసం.. కేంద్రం రూ. 290 కోట్లు ఇస్తే తెలంగాణ సర్కార్ ఆ నిధుల్లోనూ కేవలం రూ. 160 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని లెక్కలు బయట పెట్టారు.

అయితే.. అరవింద్ విమర్శలపై టీఆర్ఎస్ భగ్గు మంది. అరవింద్‌కు సంస్కారం లేదని.. మండిపడ్డారు. రూ. 290 కోట్లు మాత్రమే ఇచ్చామని స్వయంగా కేంద్ర మంత్రి చెబితే.. బీజేపీ నేతలు మాత్రం ఏడు వేల కోట్లిచ్చారని అబద్దాలు చెబుతున్నారని అంటున్నారు. ఈ మాటల మంటలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నేతలు పన్నుల రూపంలో ఇవ్వాల్సిన వాటను కూడా…. ఏదో కేంద్ర సాయం అన్నట్లుగా చెబుతూండటంతో సమస్య వస్తోంది. తెలంగాణ నుంచి పన్నులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ముందు ముందు ఈ నిధుల ఫైట్ మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఒకరిని మించి ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవడానికి వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close