బీజేపీ సూపర్ సీనియర్లకు నిద్ర లేకుండా చేస్తున్న బాబ్రీ తీర్పు

1992 డిసెంబర్‌ 6న ఆయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై లఖ్‌నవ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు …తీర్పు వెల్లడించనుంది. లిబర్హాన్‌ కమిషన్‌ 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2009లో నివేదిక ఇచ్చింది. మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితులుగా బీజేపీ సీనియర్‌ నేతలు ఆద్వానీ, మురళీ మనోహర్‌జోషి, కల్యాణ్ సింగ్, ఉమాభారతితో పాటు వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ నేతలున్నారు. మసీదు కూల్చివేతకు నేర పూరిత కుట్ర పన్నారని అద్వానీతో పాటు పలువురిపై సీబీఐ అభియోగాలు నమోదుఏసింది. 2001లో అద్వానీతో సహా ఇతరులపై కుట్రపూరిత ఆరోపణలను సీబీఐ కోర్టు కొట్టివేసింది.

ఈ తీర్పును అలహాబాద్‌ కోర్టు సమర్థించింది. అలహాబాద్‌ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఓవర్‌రూల్‌ చేసింది. అద్వానీతో పాటు ఇతరులపై నమోదైన నేరపూరిత కుట్ర అభియోగాలను రీస్టోర్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండేళ్లలో విచారణను పూర్తిచేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఆ గడువు ముగిశాక మరో నెలలు 9 నెలల పాటు పొడిగించింది. ఈ గడువు కూడా గత నెలాఖరుకు ముగిసింది. అయితే మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేయడంతో సుప్రీంకోర్టు ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చింది. దీంతో సీబీఐ ప్రత్యేకకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. తుది తీర్పు సమయంలో.. నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు గతంలోనే ఆదేశించింది.

అయితే వయోభారం కారణం… కరోనా కారణంగా కోర్టు అనుమతిస్తే వాళ్లు ముగ్గురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు తీర్పు వింటారు. మసీదు కూల్చివేతపై నిందితులుగా పేర్కొన్న వారి వాదన మరోలా ఉంది. బీజేపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీనియర్ నేతలు అయోధ్య వెళ్లిన సందర్భంగా ఆ ప్రాంతాన్ని సందర్శించామని అప్పుడు కొందరు ఆవేశంతో మసీదును కూల్చివేశారని వారు వాదిస్తున్నారు. నాయకులెవ్వరూ కరసేవకులను రెచ్చగొట్టలేదని చెప్పుకొచ్చారు. ఎవరి వాదన ఏమిటో.. బాబ్రీ కూల్చివేతకు కారకులు ఎవరో సీబీఐ కోర్టు తేల్చనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close