సినిమాల‌పై వివ‌క్ష ఎందుకు: నిర్మాతల ఆవేద‌న‌

అక్టోబ‌రు 15 నుంచి థియేట‌ర్లు తెర‌చుకోబోతున్నాయి. నిజానికి నిర్మాత‌లంతా ఈ క్ష‌ణాల కోస‌మే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ వార్త వాళ్ల‌లో ఉత్సాహాన్ని తీసుకురాలేక‌పోయింది. ఎందుకంటే సిట్టింగ్ ని 50 శాత‌మే.. ప‌రిమితం చేయ‌డం అస‌లు కార‌ణం. ఈ నిర్ణ‌యం నిర్మాత‌ల‌కు మింగుడు ప‌డ‌నివ్వ‌డం లేదు. “విమాన ప్ర‌యాణాల్లో ఎలాంటి ప‌రిమితీ లేదు. థియేట‌ర్ల‌కు మాత్రమే 50 శాతం సిట్టింగ్ అంటే ఎలా? త‌న‌కు ఇబ్బందిగా ఉంటే.. థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయే అవ‌కాశం ప్రేక్ష‌కుడికి ఉంది. విమాన ప్ర‌యాణికుల‌కు అది కూడా ఉండ‌దు క‌దా” అని ప్ర‌ముఖ నిర్మాత‌, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు సి.క‌ల్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వంద శాతం సిట్టింగ్ ఉన్న‌ప్పుడే చిత్ర‌సీమ‌కు న‌ష్టాలు రావ‌డం ప‌రిపాటిగా ఉంటుంద‌ని, స‌గం సీట్లంటే.. నిర్మాత మునిగిపోవ‌డం ఖాయ‌మ‌ని వాపోతున్నారాయ‌న‌.

మ‌రో బ‌డా నిర్మాత‌ డి.సురేష్‌బాబు వాద‌న కూడా ఇదే. షాపింగ్ మాల్స్ తెర‌చుకునే అవ‌కాశం ఉన్న‌ప్పుడు, సినిమాల‌కు వ‌చ్చిన ఇబ్బందేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిర్మాత‌లకు ఇది నిజంగా క‌ష్ట‌కాల‌మ‌ని, ఇలాంటి స్థితిలో పెద్ద సినిమాలు విడుద‌ల‌కు సాహ‌సం చేయ‌వ‌ని తేల్చేశారాయ‌న‌. పైగా.. కేంద్ర ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇచ్చినా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిగా నిర్ణ‌యం తీసుకోవాల్సివ‌స్తుంది. కేంద్రం ఓకే అన్నా, రాష్ట్రాలు నో చెబితే థియేట‌ర్లు తెర‌చుకోవు. ఏపీ, తెలంగాణ‌ల‌లో క‌రోనా ఉధృతి ఇంకా ఉంది. ఈ ద‌శలో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు థియేట‌ర్లు తెర‌వ‌డానికి ఒప్పుకుంటారా? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. వాళ్లు ఒప్పుకున్నా నిర్మాత‌లూ రెడీగా లేరు. ఒక‌వేళ థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇస్తే.. 50 శాత‌మే సిట్టింగ్ అన్న ష‌ర‌తుని ఉప‌సంహ‌రించుకోవాల‌ని నిర్మాత‌లు డిమాండ్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు : బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..?

లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే...

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close