ఇక “అన్న జేసీ” వంతు..!?

కాలం మారుతుందని… తమదై కాలం వచ్చినప్పుడు అంతకంతకూ బదులు తీర్చుకుంటామని మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చిరిక జారీ చేశారు. తమకు చెందిన గనుల్లో అధికారులు తనిఖీలు చేయడాన్ని ఖండించారు. తమ గనుల్లో ఎవరైనా నక్సలైట్లు ఉన్నారా అని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గనులకు సంబంధించిన పర్మిట్లు పెండింగ్‌లో పెట్టి.. తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆయన తాడపత్రిలోని గనుల కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలకు చెందిన గనులు చాలా ఉన్నా..వాటిలో సోదాలు చేయకుండా… తమ గనుల్లో మాత్రమే సోదాలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమ ఉపాధిని దెబ్బతీసి.. తమకు తిండినీరు లేకుండా చేద్దామని చూస్తున్నారని జేసీదివాకర్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

తాడిపత్రిలో గనులశాఖ కార్యాలయానికి వెళ్లిన జేసీ దివాకర్‌రెడ్డికి ఖాళీ కుర్చీలే కనిపించాయి. తాను వస్తున్నానని తెలుసుకొని మైన్స్‌ ఏడీ పరారయ్యారని మండిపడ్డారు. పోలీసులు బదిలీలకు భయపడి అధికార పార్టీకి ఊడిగం చేయొద్దని సూచించారు. పోలీసులు ఇంత బానిస బతుకు ఎందుకు బతుకుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాలం మారుతుంది జాగ్రత్త అని కూడా హెచ్చరికలుజాీర చేశారు. మా ప్రభుత్వం వస్తే మేం కాదు..మా కార్యకర్తలు అధికారులను వదలరని హెచ్చరికలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జేసీ కుటుంబం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.

జేసీ బ్రదర్స్‌లో తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదైన కేసులు అన్నీఇన్నీ కావు. ఆయనను చాలా కాలం పాటు జైల్లో పెట్టారు. ఒక దాంట్లో బెయిల్ వస్తే.. మరో కేసులో జైలులో పెట్టారు. చివరికి కరోనా సోకడంతో ట్రీట్‌మెంట్ కోసం బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. ఇప్పుడు.. పెద్ద జేసీగనులపై దృష్టి పెట్టారు. జేసీ ఫ్యామిలీ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు ఇప్పటికే జేసీకి చెందిన ట్రావెల్స్ బిజినెస్‌ ఇప్పటికే రవాణ శాఖ అధికారుల దెబ్బకు మూలన పడింది. గతంలో త్రిశూల్ గనుల కేటాయింపునుకూడా రద్దు చేశారు. ఇప్పుడు మిగిలి ఉన్న గనులను కూడా రద్దు చేసేందుకు వ్యూహం పన్నుతున్నారని ఆయన అనుమానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close