సజ్జల చెప్పాక ఉద్యోగసంఘాలు జీతం బకాయిలు అడుగుతాయా..!?

ఉద్యోగులకు నిలిపివేసిన జీతాలు ఎలా చెల్లించాలా అని ఏపీ సర్కార్ కిందా మీదా పడుతోంది. రెండు నెలల్లో 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు నెలలు దాటిపోయినా ప్రభుత్వం చెల్లించలేదు. అయితే ఇలా ఎంతో కాలం సైలెంట్ గా ఉండలేరు కాబట్టి.. ఉద్యోగ సంఘాలను పిలిపించిన ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు… వారికి ప్రభుత్వ వెర్షన్ వినిపించారు. ఎలాగూ ఉద్యోగ సంఘాల నేతలు… సామాజిక బాధ్యత ఉందని ప్రకటన చేస్తున్నారు కాబట్టి… మిగిలిన వారు నోరెత్తడం కష్టమే. సీఎంవో నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు.. వచ్చిన ఉద్యోగ సంఘాలతో సజ్జల చర్చలు జరిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. మే, జూన్‌లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన 15 రోజుల జీతాన్ని.. రాబోయే రెండు నెలల్లో ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే డీఏను కూడా పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సజ్జల బుజ్జగించి పంపేశారు. జీతాల బకాయిలు… డీఏపై .. త్వరలో ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన చేస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలను సీఎంవో అధికారులు పంపేశారు.

ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఉద్యోగులు నోరెత్తే పరిస్థితి లేదు. ఎవరూ కోర్టుకెళ్లే అవకాశం కూడా లేదు. ఎవరైనా అలా వెళ్తే.. వారి ఉద్యోగానికి గ్యారంటీ లేదు. అందుకే.. సజ్జల చెప్పింది విని వెళ్లడం తప్ప.. మరో దారి వారికి లేదు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు కోర్టుకు వెళ్తే తప్ప.. మళ్లీ ఈ వ్యవహారంలో కదలిక ఉండకపోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close