పాపం కన్నా..! పార్టీలో కూడ ఉండనిచ్చేలా లేరుగా..!?

బీజేపీ మాజీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు బీజేపీలోనే పొగ పెడుతున్నారు. ఇప్పటికే ఆయనను పార్టీ వ్యవహారాల్లో కరివేపాకులా పక్కన పెట్టేశారు. వైసీపీ అవినీతిపై ఆయన చేసిన పోరాటం నచ్చలేదో.. అలా పోరాటం చేయడం అంటే.. టీడీపీకి మేలు చేయడం అనే వైసీపీ ప్రచారం ట్రాప్‌లో పడ్డారో కానీ.. మొత్తానికి ఆయన పదవిని ఊడబీకేశారు. తర్వాత ఎలాంటి పదవి ఇవ్వలేదు. సాధారణంగా రాష్ట్ర అధ్యక్ష పదవి స్థాయిలో పని చేసిన వారికి తర్వాత జాతీయ స్థాయిలో ఏదో ఓ పదవి ఇస్తారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా పని చేసిన లక్ష్మణ్‌కు జాతీయ స్థాయిలో ఓబీసీ మర్చి పదవి ఇచ్చారు. కానీ కన్నాను కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఎలాంటి పదవి ఇవ్వలేదు.

కన్నాను పట్టించుకోకపోగా.. ఇప్పుడు బీజేపీ వైపు నుంచి.. వైసీపీ వైపు నుంచి ఒకే రకరమైన ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు. ఆయనను బీజేపీ నుంచి బయటకు పంపాలన్న ప్రణాళికతో.. వీడియోలు వదులుతున్నారు. కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలనుకుంటున్నారని .. నేడో రేపో చేరిపోతారని ప్రచారం చేస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ రాజకీయ జీవితం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి ప్రచారం చేయరు. కన్నాకు చంద్రబాబు పొడే గిట్టదు. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేయడంలో ఆయన ముందు ఉంటారు. కానీ ఆయను ఎలా అయినా బీజేపీ నుంచి బయటకు పంపాలన్న ఉద్దేశంతో చంద్రబాబుకు లింక్ పెట్టి ప్రచారం చేస్తున్నారు.

వాస్తవానికి కన్నా బీజేపీలో ఉండి.. తన రాజకీయ భవిష్యత్‌కు నష్టం చేసుకున్నారు. వైసీపీలో చేరడానికి సిద్ధమై.. ఇంటి ముందు ఫ్లెక్సీలు పెట్టుకుని… అమిత్ షా ఫోన్ చేశారని ఆగిపోయారు. లేకపోతే.. ఈ పాటికి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండేవారు. ఆ విషయం చెప్పడానికి ప్రత్యేకంగా విశ్లేషణలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా.. ఆయన ఆసక్తి చూపిస్తే.. వైసీపీలో చేర్చుకుంటారు. ఆయనకు వర్గ బలం ఉంది. ఎలాగైనా ఆయనను ముందుగా బీజేపీ నుంచి బయటకు పంపాలన్న ప్రణాళికను మాత్రం.. వైసీపీ, బీజేపీ సోషల్ మీడియా టీంలు.. అమలు చేస్తున్నాయి. మరి ఈ వ్యూహాన్ని కన్నా ఎలా ఎదుర్కుంటారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close