అమరావతికి పెట్టిన ఖర్చెంతో కోర్టుకు చెప్పకూడదట..!

అమరావతి నిర్మాణాలకు ఎంత ఖర్చయిందో హైకోర్టుకు చెప్పడానికి అకౌంటెంట్ జనరల్ సిద్ధపడలేదు. హైకోర్టు అడిగితే.. వివరాలు ఇచ్చే అధికారం తనకు లేదని డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ తరపున హైకోర్టులో అఫిడవిట్ దాఖలయింది. అమరావతి పిటిషన్లపై విచారణలో భాగంగా హైకోర్టు.. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో.. ఇంకా ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో చెప్పాలని అకౌంటెంట్ జనరల్‌ని ఆదేశించింది. అయితే.. రెండు, మూడు సార్లు గడువిచ్చినా సమర్పించలేదు. గత విచారణలో.. ఆ వివరాలన్నీ సమర్పించకపోతే అకౌంటెంట్ జనరల్‌ను హైకోర్టుకు పిలిపించాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరిచింది.

దీంతో.. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ పేరుతో అపిఢవిట్ దాఖలు చేశారు. కేంద్రం వెచ్చించిన నిధులపై పార్లమెంట్‌ అడిగితే సమాచారం ఇస్తామని.. రాష్ట్రం మంజూరు చేసే నిధులపై శాసనసభ అడిగితే సమాచారం ఇస్తామని.. కానీ.. వ్యయం చేసే నిధుల వివరాలు ఇవ్వడానికి అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. కాగ్‌ది రాజ్యాంగ బద్ధ సంస్థ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ చెప్పుకొచ్చారు. అమరావతికి ఎంత ఖర్చయిందో చెప్పడానికి.. ప్రభుత్వం సిద్ధంగా లేదని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని అంటున్నారు. అమరావతి ఖర్చుపై ప్రభుత్వ పెద్దలు రకరకాలుగా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు.

అదే సమయంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును.. ప్రజా సంపదను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా ఎంత ఖర్చయిందో చెప్పడానికి ప్రభుత్వం తటపటాయిస్తోందని చెబుతున్నారు. కోర్టుకు వ్యయం వివరాలు అడిగే అధికారం లేదన్నట్లుగా అఫిడవిట్ దాఖలు చేయడం కలకలం రేపుతోంది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close