వలసల నేపథ్యంలో బేరాలాడుతున్న పాత గులాబీలు!

తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేలు తెరాసలోకి బాగానే వలసలు వచ్చేశారు. ఇంకా రావచ్చుననే ప్రచారం కూడా బాగా జరుగుతోంది. ఇదంతా బాగానే ఉంది. మరి ఆయా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎప్పటినుంచో గులాబీ పార్టీనే నమ్ముకుని.. అక్కడ పార్టీ జెండాలు మోస్తూ బతుకుతున్న అక్కడి నియోజకవర్గ స్థాయి నాయకులు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే ఫిరాయించిన తర్వాత.. తాము కూడా ఎమ్మెల్యేలు కావాలనే వారి ఆశలు అడుగంటిపోతాయి కదా.. లాంటి సందేహాలు రేకెత్తడం సహజం. అయితే.. తెదేపా ఎమ్మెల్యేలు ఫిరాయిస్తుండడాన్ని పురస్కరించుకుని, ఆ నియోజకవర్గాల్లోని పాత గులాబీలు.. కొత్త బేరాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఎటూ తాము ఎమ్మెల్యే కాగల ఆశలను పార్టీ సమాధి చేసేసింది గనుక.. ‘ఇతరత్రా’ తమకు ప్రయోజనాలు కల్పించాలని బేరాలు పెడుతున్నారుట. తెదేపా ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చిన దాదాపు ప్రతిచోటా.. ఇన్నాళ్లూ సదరు తెదేపా వారితో పోరాడిన గులాబీ నేతలు పార్టీ నాయకత్వం వద్ద ఇలాంటి డిమాండ్లే వినిపిస్తున్నారని సమాచారం.

ఫరెగ్జాంపుల్‌.. వరంగల్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తెరాస ఇన్చార్జి సుదాకర్‌ రావు ఇప్పుడు పార్టీ నిర్ణయాల మీద కత్తులు నూరుతున్నారు. ఇన్నాళ్లూ నియోజకవర్గం స్థాయిలో తమకు శత్రువుగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకరరావు పార్టీలో చేరడాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోయేది లేదని చెబుతున్నారు. ఇక్కడి పార్టీ వ్యవహారాల మీద ఒక మంత్రుల కమిటీని వేయాలన కూడా ఆయన కోరుతున్నారు. మంత్రుల కమిటీ వేయించుకుని, వారిద్వారా బుజ్జగించే చర్యలు మొదలైతే గనుక.. ఆయా మంత్రుల ద్వారా.. కనీసం ఇతరత్రా ప్రయోజనాలు ఏమైనా కలిగేలా బేరాలాడుకోవచ్చుననేది ఈ నేతల ఆలోచనగా కనిపిస్తున్నది. మొత్తానికి అధికార పార్టీ గనుక.. అప్రతిహతంగా కొనసాగుతున్న పార్టీ గనుక.. ఈ అంసతృప్తులతో ఎవ్వరూ పార్టీని వీడరు గానీ.. అందరికీ విడివిడిగా బుజ్జగింపులు మాత్రం అవసరం అవుతాయని పార్టీలో అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close