మంత్రి పేర్ని నానిపై “తాపీ”తో దాడి..!

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై ఓ తాపీ మేస్త్రి తాపీతో దాడికి దిగాడు. తాపీ తీసుకుని పొట్టలో పొడవడానికి ప్రయత్నించాడు. గుర్తించిన పేర్ని నాని పక్కుకు తప్పుకున్నాడు. ఈ క్రమంలో ఆయన చొక్కా చినికిపోయింది. నిందితుడ్ని చెమ్మన్నగిరిపేటకు చెందిన బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. దాడికి ప్రయత్నించినప్పుడు.. నాగేశ్వరరావు మద్యం మత్తులో ఉన్నట్లుగా గుర్తించారు. మంత్రి అనుచరులు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు. ఆదివారం సందర్భంగా మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ప్రజల్ని కలుస్తున్నారు. గేట వద్ద ఉన్నప్పుడు.. తాపీ మేస్త్రి నాగేశ్వరరావు అక్కడకు వచ్చాడు. వచ్చీ రావడంతోనే నాని కాళ్లపై పడే ప్రయత్నం చేశారు.

ఆ క్రమంలో ఒక్క సారిగా తన వద్ద ఉన్న తాపీని తీసి పొడిచే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన వెంటనే.. నాగేశ్వరరావును మంత్రి అనుచరులు పట్టుకున్నారు. నాగేశ్వరరావు ఎందుకు దాడి చేశాడో తెలియదని.. పేర్ని నాని చెబుతున్నారు. పోలీసులు వెంటనే నాగేశ్వరరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నాగేశ్వరరావు నేరచరిత్రను ఆరా తీస్తున్నారు. పార్టీలకు సంబంధం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ తెలిపారు. కొద్ది రోజుల కిందట… నార్ని ముఖ్య అనుచరుడైన మోకా భాస్కర్ రావును కొంత మంది మార్కెట్లో హత్య చేశారు. ఆ తర్వాత నిందితులకు సహకరించారంటూ.. టీడీపీకి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసులు పెట్టి చాలా రోజులు జైల్లో ఉంచారు.

ఇప్పుడు పోలీసులు ఈ ఘటనలో రాజకీయ పార్టీల ప్రేమేయం ఉందన్న కోణంలో విచారణ చేస్తున్నామని చెప్పడంతో.. ఎవరి పేర్లను పోలీసులు బయట పెడతారోనన్న చర్చ జరుగుతోంది. తాపీ మేస్త్రి అయిన నాగేశ్వరరావు మద్యానికి బానిసయ్యారు. చేయడానికి పనులు లేకపోవడం.. మద్యం రేట్లు భారీగా ఉండటంతో మంత్రిపై దాడికి పాల్పడినట్లుగా మచిలీపట్నంలో ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close