బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం… రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. చాలా రోజుల తర్వాత రైతుల కోసం ప్రజల్లోకి వెళ్తున్నాయి. నివార్ తుపాను వల్ల పాడైన పంటలను పరిశీలించేందుకు కోస్తా, రాయలసీమలకు వెళ్తున్నారు. బుధవారం నుంచి పవన్ పర్యటన ప్రారంభమవుతుంది. బుధవారం గుంటూరు జిల్లాలో ఆ తర్వాత మూడు రోజుల పాటు అంటే.. 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు.

పంట నష్టపోయిన రైతులతో సమావేశమవుతారు. వారికి నష్టపరిహారం ప్రకటించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పవన్ కల్యాణ్ పర్యటన ఉండే అవకాశం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందు పవన్ కల్యాణ్ యథేచ్చగా తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు. తర్వాత ఆయన ఏ పని చేయాలన్నా.. బీజేపీ పర్మిషన్ తో చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా జనసేనాని పర్యటనలు కూడా కుదించుకుపోయాయి. ఓ వైపు బీజేపీ నేతలు.. తమ పర్యటనలు.. కార్యక్రమాలు తాము చేసుకుంటున్నారు. జనసేన మాత్రం కామ్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక బీజేపీతో అన్నింటినీ చర్చించాల్సిన పని లేకుండా.. పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

ఈ పర్యటనలో చిత్తూరు జిల్లాలోనూ పర్యటించబోతున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. అక్కడ తన బలాన్ని ఆయన ప్రదర్శించే అవకాశం ఉంది. తిరుపతిలో పోటీ చేయాలని జనసేన అనుకుంటోంది. కానీ బీజేపీ మాత్రం.. తామే పోటీ చేస్తామని చెబుతోంది. ఈ సందర్భంగా.. రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు.. తిరుపతిలో తమ బలాన్ని ప్రదర్శించి.. బీజేపీకి అవకాశం లేదని చెప్పేలా.. పర్యటన భారీగా ఉండేలా జనసేనాని ప్లాన్ చేసుకుంటున్నారు. అటు రైతులకు సాయం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదుకు.. ఇక రాజకీయంగా బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు పవన్ కల్యాణ్ టూర్ ఉపయోగపడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close