పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత మొత్తం రైతు.. ఎక్కువ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ.. బీమా ఉచితం.. ప్రభుత్వమే మొత్తం చెల్లిస్తుందని ప్రకటించింది. దీంతో రైతులెవరూ ఒక్క రూపాయి కూడా బీమా కోసం చెల్లించలేదు. మరి ప్రభుత్వం చెల్లించిందా అంటే అదీ లేదు. ప్రభుత్వం కూడా బీమా చెల్లించలేదు. దీంతో రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఫలితంగా పంటలకు నష్టం జరిగినా.. బీమా సొమ్ము వచ్చే అవకాశం లేకుండా పోయింది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. దాని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ఏపీ సర్కార్ కూడా అదే తరహాలో పథకాన్ని ఎంతో కాలం నుంచి అమలు చేస్తోంది. అందుకే.. అసెంబ్లీలోనే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతుల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించామని ప్రకటించారు. కానీ టీడీపీ సభ్యులు అబద్దాలు చెప్పొద్దని నిలదీశారు. పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని.. పత్రాలు చూపించారు. దీంతో కన్నబాబు నాలిక్కరుచుకున్నారు. డిసెంబర్ 15న ప్రీమియం చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అప్పటిదాకా చెల్లించామని చెప్పి… ఇప్పుడు డిసెంబర్ పదిహేనో తేదీన చెల్లిస్తామని మాట మార్చడంతో చెల్లించలేదని స్పష్టమయింది. దీంతో రైతుల గుండెల్లో రాయి పడినట్లయింది.

ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా…. పూర్తిగా నష్టపోయినా… కనీసం పెట్టుబడిలో సగం అయినా పంటల బీమా ద్వారా రైతులు పొందేవారు. ఇప్పుడు.. అలాంటి అవకాశమే లేకుండా పోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎంత ఇస్తుందో క్లారిటీ లేదు. గతంలో జరిగిన నష్టానికి 13 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఏపీలో 70 లక్షల మంది వరకూ రైతులు ఉన్నారు. ఆ పదమూడు లక్షల మందికి సగటున రూ. మూడు వేలు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల్ని ఆదుకునేది ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. ప్రభుత్వం నేరుగా సాయం చే్యకపోయినా.. బీమా ద్వారా రావాల్సిన దాన్ని కూడా.. రాకుండా చేసేశారు. ఫలితంగా రైతులు నిలువుగా మునిగిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close