కర్ణాటకలోనూ పంచాయతీఎన్నికలు..!

కరోనా కేసులు ఆంధ్రతో పోలిస్తే ఎక్కువగా నమోదవుతున్న కర్ణాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ప్రకటించేశారు. డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. నిజానికి అక్కడి ఎస్‌ఈసీ కూడా గతంలో ఆరు నెలల పాటు ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తర్వాత నిర్వహించాలనుకున్నారు. ఎన్నికల నిర్వహణపై కొంత మంది కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో.. కర్ణాటకలో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అయింది.

ప్రస్తుతం కర్ణాటకలో కరోనా సెకండ్ వేవ్ కనిపిస్తోంది. కేసులు మెల్లగా పెరుగుతన్నాయి. అయినప్పటికీ.. అక్కడ రోజువారీ వ్యవహారాలకు పెద్దగా ఆటంకాలు కలగడం లేదు. అన్ని యథావిధిగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ జాడ కూడా లేదు. గతంలో వేలల్లో కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు.. రెండు, మూడు వందలు మాత్రమే నమోదవుతున్నాయి. మరణాలు, యాక్టివ్ కేసులు కూడా..భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం.. పెట్టేది లేనే లేదని అంటోంది. తన విధులకు ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధమని.. ఆయన వాదిస్తున్నారు. అయితే.. ఓ వైపు హైదరాబాద్ ఎన్నికలు.. మరో వైపు కర్ణాటక పంచాయతీ ఎన్నికలు జరుగుతూండగా.. ఏపీలో ఎన్నికలు నిర్వహించడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నలు వస్తున్నాయి. అయినా ఏపీ సర్కార్ మాత్రం కారణాలు ఏం చెప్పినా.. నిమ్మగడ్డ ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close