పాపం ఏపీ రైతులు..! పంటల బీమా సొమ్ము కూడా రాదు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఆర్థిక సమస్యలో.. మరో కారణమో కానీ.. ఏమీ ఇవ్వడం లేదు. కానీ ప్రభుత‌్వాలు ఆనవాయితీగా పంటల బీమా చెల్లిస్తూ వస్తున్నాయి. కొంత మొత్తం రైతు.. ఎక్కువ మొత్తం ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ.. బీమా ఉచితం.. ప్రభుత్వమే మొత్తం చెల్లిస్తుందని ప్రకటించింది. దీంతో రైతులెవరూ ఒక్క రూపాయి కూడా బీమా కోసం చెల్లించలేదు. మరి ప్రభుత్వం చెల్లించిందా అంటే అదీ లేదు. ప్రభుత్వం కూడా బీమా చెల్లించలేదు. దీంతో రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఫలితంగా పంటలకు నష్టం జరిగినా.. బీమా సొమ్ము వచ్చే అవకాశం లేకుండా పోయింది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని అమలు చేస్తోంది. దాని వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ఏపీ సర్కార్ కూడా అదే తరహాలో పథకాన్ని ఎంతో కాలం నుంచి అమలు చేస్తోంది. అందుకే.. అసెంబ్లీలోనే వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతుల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించామని ప్రకటించారు. కానీ టీడీపీ సభ్యులు అబద్దాలు చెప్పొద్దని నిలదీశారు. పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని.. పత్రాలు చూపించారు. దీంతో కన్నబాబు నాలిక్కరుచుకున్నారు. డిసెంబర్ 15న ప్రీమియం చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. అప్పటిదాకా చెల్లించామని చెప్పి… ఇప్పుడు డిసెంబర్ పదిహేనో తేదీన చెల్లిస్తామని మాట మార్చడంతో చెల్లించలేదని స్పష్టమయింది. దీంతో రైతుల గుండెల్లో రాయి పడినట్లయింది.

ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా…. పూర్తిగా నష్టపోయినా… కనీసం పెట్టుబడిలో సగం అయినా పంటల బీమా ద్వారా రైతులు పొందేవారు. ఇప్పుడు.. అలాంటి అవకాశమే లేకుండా పోయింది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎంత ఇస్తుందో క్లారిటీ లేదు. గతంలో జరిగిన నష్టానికి 13 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. ఏపీలో 70 లక్షల మంది వరకూ రైతులు ఉన్నారు. ఆ పదమూడు లక్షల మందికి సగటున రూ. మూడు వేలు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రైతుల్ని ఆదుకునేది ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. ప్రభుత్వం నేరుగా సాయం చే్యకపోయినా.. బీమా ద్వారా రావాల్సిన దాన్ని కూడా.. రాకుండా చేసేశారు. ఫలితంగా రైతులు నిలువుగా మునిగిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close