వైసీపీ సోషల్ మీడియా టీంకు విజయసాయి భరోసా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బృందాలకు విజయసాయిరెడ్డి మంచి ట్రీట‌్ చేస్తున్నారు. పార్టీ తన చేతి నుంచి జారిపోయినా.. సోషల్ మీడియా మాత్రం విజయసాయిరెడ్డి చేతుల్లోనే ఉంది. ఇటీవలి కాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కోర్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలే దీనికి కారణం. సీబీఐ విచారణ కూడా ప్రారంభమయింది. కోర్టులపై చేసిన వ్యాఖ్యలుఅన్నీ ఆర్గనైడ్డ్‌గా జరగడంతో… తాము ఇరుక్కుపోతామనే భావన చాలా మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల్లో ఉంది. అందుకే.. వారి ఇటీవలి కాలంలో తమ జోరు తగ్గించారు. దీంతో విజయసాయిరెడ్డి.. అందర్నీ మళ్లీ కార్యోన్ముఖుల్ని చేయాలని నిర్ణయించుకున్నారు.

తాడేపల్లిలో..అన్ని రాష్ట్రాల సోషల్ మీడియా సపోర్టర్స్‌ను పిలిచి తాడేపల్లిలో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో తానున్నానని భరోసా ఇస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి .. సోషల్ మీడియానే కీలకమని.. అందుకే… ముఖ్యమంత్రి జగన్.. వారికి ఇచ్చిన అన్ని హామలను నెరవేర్చడానికి సిద్ధంగామని విజయసాయిరెడ్డి వారికి ధీమా కల్పించే ప్రయత్నం చేశారు. ఎనిమిది నుంచి పదివేల మంది వరకూ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారని.. అందరికీ ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు.

తిట్లు, శాపనార్థాలు, దాడులతో వైసీపీ సోషల్ మీడియా.. కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో.. కోర్టుధిక్కరణ వంటి కేసులు పెడితే.. వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే విజయసాయిరెడ్డి… సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టి పోరాట చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంలో ఆదినారాయణకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close