తప్పించుకునేందుకు హైకోర్టులో అగ్రిగోల్డ్ వింత పిటిషన్లు ..!

విచ్చలవిడిగా డిపాజిట్లు సేకరించి చెల్లించలేక చేతులెత్తేసిన అగ్రిగోల్డ్ సంస్థ.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు ఓ విచిత్రమైన ప్రతిపాదన సమర్పించింది. గత విచారణలో… చెల్లించాల్సిన వారితో వన్ టైమ్ సెటిల్మెంట్ చేసుకుంటామనే ప్రతిపాదన తీసుకు వచ్చి.. కోర్టు చేత చీవాట్లు తిన్న అగ్రిగోల్డ్ యాజమాన్యం తాజాగా… అలాంటిదే మరో ప్రతిపాదన హైకోర్టు ధర్మాసనం ముందు ఉంచింది. 15 నుంచి 60 నెలల్లో 23 ఆస్తులను జాయింట్ వెంచర్ ల ద్వారా అభివృద్ధి చేసి 2040 కోట్లు సమకూర్చుతామని.. అందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసింది. ఈ అంశంపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థికశాఖ.. ఈడీ, బ్యాంకులు, పిటిషనర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

బ్యాంక్ లతో వన్ టైమ్ సెటిల్మెంట్ కు అవకాశం ఇవ్వాలని, అటాచ్ చేసిన ఆస్తులు తాము అమ్మేందుకు అవకాశం ఇవ్వాలని దాఖలు చేసిన మద్యంతర దరఖాస్తులను ఉపసంహరించుకోవడంతో వాటిని డిస్మిస్ చేసింది. అగ్రిగోల్డ్ కేసు విచారణ అమరావతి హైకోర్టుకు బదిలీ చేయాలని.. తెలంగాణ హైకోర్టును ఏపీ సర్కార్ కోరింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం తెలిపింది. అగ్రిగోల్డ్ వ్యవహారం ఏళ్ల తరబడి నలుగుతూనే ఉంది. అది రాజకీయ అంశం కూడా అయింది. టీడీపీ హయాంలో బాధితులకు న్యాయం జరగలేదని వైసీపీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే.. రూ. 1150 కోట్లు వెంటనే చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే.. ఏడాది దాటినా రూ. 300 కోట్లే చెల్లించగలిగారు.

ఇప్పుడు డిపాజిటర్ల ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో.. ఆస్తులన్నీ అమ్మేసి.. డిపాజిటర్లకు చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే అనూహ్యంగా… అగ్రిగోల్డ్.. తాము ఆస్తులను అభివృద్ధి చేసి విక్రయిస్తామని.. రెండు వేల కోట్లు కడతామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. దాని కోసం ఏకంగా ఐదేళ్ల గడువు కోరడం కూడా.. ఆర్థిక నిపుణుల్ని కూడా విస్మయపరుస్తోంది. ఆస్తులను వేలం వేయకుండా.. అగ్రిగోల్డ్ యాజమాన్యం కొత్త కుట్రలు చేస్తోందన్న అనుమానాలను డిపాజిటర్లు వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close