బెంగాల్ తర్వాత తెలంగాణలోనే బీజేపీ ఆకర్ష్ ఆపరేషన్..!?

తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రమాద ఘంటికలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ వచ్చి చేసిన హెచ్చరికలే దీనికి కారణం. ఇప్పుడు ట్రైలరే చూపించామని.. ముందు ముందు సినిమా చూపిస్తామని అయన అంటున్నారు. బెంగాల్‌లో దీదీకి సెవన్టీ ఎంఎం సినిమా ఇప్పటికే చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు సంధి కాలంలో ఉంది. ఇప్పటి వరకూ అన్ని పార్టీల నుంచి కారులోకి వచ్చి చేరిన నేతలతో ఓవర్ లోడ్‌లో ఉంది. అవకాశాలు రాని వాళ్లు చాలా మంది ఉన్నారు. అవకాశాలు వచ్చిన వాళ్లు కూడా ప్రాధాన్యం దక్కడం లేదని.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ దక్కడం లేదన్న అభిప్రాయంతో .. మారిన రాజకీయ పరిస్థితుల్లో పక్క చూపులు చూస్తున్నారన్న అభిప్రాయం కూడా టీఆర్ఎస్‌లో వినిపిస్తోంది.

తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ హైకమాండ్ చాలా పకడ్బందీ ప్రణాళిక పెట్టుకుంది. వారు టార్గెట్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. ప్రస్తుతం బెంగాల్లో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఎమ్మెల్యేలను ఆకర్షించాలంటే.. బీజేపీని మించిన పార్టీ లేదు. నేతల్ని తమ పార్టీలోకి నయానో..భయానో ఆహ్వానించడంలో టీఆర్ఎస్ కూడా తక్కువేమీ కాదు. కానీ రాష్ట్రం కన్నా.. కేంద్రం అధికారం పెద్దది కాబట్టి.. టీఆర్ఎస్ ఇప్పుడు సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి. గ్రేటర్ మేయర్ పీఠం కోసం.. బీజేపీ కార్పొరేటర్లను ఆకర్షిస్తే.. అంత కన్నా పెద్ద రాజకీయ తప్పిదం ఉండదని.. రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారికైనా అర్థమవుతుంది. మరి కేసీఆర్ మాత్రం ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటారు..?

గ్రేటర్ మేయర్ పీఠమే టార్గెట్ అయితే.. ఉన్న కార్పొరేటర్లతోనే గెలుచుకోవడం టీఆర్ఎస్ కు చిటికెలో పని. ఎంఐఎం గైర్హాజర్ అయితే చాలు. కానీ బీజేపీ.. తమ కార్పొరేట్లను టీఆర్ఎస్ ఆకర్షించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తోంది. ఇది కూడా బీజేపీ వ్యూహమేనని అంచనా వేస్తున్నారు. ఈ కారణం చెప్పి.. టీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునే ప్రణాళిక అమలు చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది. బీజేపీ రాజకీయ వ్యూహాలను అంచనా వేసి.. నొప్పింపక తానొవ్వక రీతిలో ముందుకు సాగాల్సిన పరిస్థితిలో పడిపోయింది.. టీఆర్ఎస్ చూపిస్తున్న తప్పనిసరి మెదకదనం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close