ఎన్నికలపై ఫైనల్ నిర్ణయం ఎస్‌ఈసీదే : హైకోర్టు

స్థానిక ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్‌దే తుది నిర్ణయం అని ఏపీ హైకోర్టు తేల్చేసింది. ఎన్నికలు నిర్వహించకుండా నిలిపివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. కరోనా కారణంగా ఎన్నికల వాయిదా విషయంపై.. ఎన్నికల కమిషన్‌కే లేఖ రాయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ప్రభుత్వ విజ్ఞప్తిని ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుందని తెలిపింది. కరోనా వ్యాక్సిన్, స్థానిక ఎన్నికలు రెండూ ప్రజలకు సంబంధించినవేనని.. దీనిపై రెండు పక్షాలు కూర్చోని మాట్లాడుకుంటే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

అలా కాకపోతే ముగ్గురు అధికారులను ఎస్ఈసీ వద్దకు పంపాలని.. కమిషన్‌తో అధికారుల భేటీపై ఎస్‌ఈసీ ఒక వేదికను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ అధికారులు వారి వాదనను కమిషన్ ముందు వినిపించాలని తెలిపింది. ఈ చర్చల అనంతరం ఎస్ఈసీ ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని గుర్తు ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేతుల్లోనే ఉంది. హైకోర్టు చెప్పినట్లుగా ప్రభుత్వ వాదన వినడానికి ఆయన సిద్ధంగా ఉండాలి. అది విన్న తర్వాత ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాలి.

ఒక వేళ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆయన అనుకుంటే.. మాత్రం… అడ్డు చెప్పడానికి ప్రభుత్వానికి చాన్స్ ఉండదు. సహకరిస్తారా లేదా.. అన్నదానిపై తర్వాత పరిణామాలు ఆధారపడి ఉంటాయి. పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరిచింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం.. అధికారులు సహకరించడం లేదని.. దిక్కరణ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close