అప్పట్లో అక్బర్ గంట అడిగారు.. ఇప్పుడు సంజయ్ పావు గంట అడుగుతున్నారు..!

వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు బీజేపీ, మజ్లిస్ నేతలు. కొన్నాళ్ల క్రితం.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ .. ఓ సమావేశంలో.. తమకు గంట పాటు స్వేచ్చ ఇస్తే.. దేశాన్ని ఇస్లామీకరణ చేస్తామన్నట్లుగా ప్రకటన చేశారు. అంటే.. ఆయన ఉద్దేశం హిందువులందర్నీ.. ఏదో చేస్తామని. ఆ మాటలు అన్నందుకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. దుమారం రేగింది.ఇప్పటికీ ఆమాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా .. ఇలాంటి ప్రకటనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేశారు.కాకపోతే… సంజయ్ కాస్త సంయమనం పాటించారు.

పదిహేను నిమిషాల పాటు స్వేచ్చ ఇస్తే.. పాతబస్తీలో రోహింగ్యాలు.. పాకిస్తాన్ వాళ్లను పట్టుకుని దేశం బయటకు తరిమేస్తారని ఆయన చెప్పారు. అయితే.. ఆయన అడిగిన ఆ పదిహేను నిమిషాలు… బీజేపీ వాళ్లకు కాదు. పోలీసులకు. పోలీసులకు పావుగంట సమయం ఇచ్చి.. పాతబస్తీకి పంపితే… దేశద్రోహులందరూ తేలుతారని ఆయన అంటున్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు… పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు ఉంటున్నారని.. వారి వల్ల ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో దీన్ని దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ ఆరోపణలు చేశారు.ఇప్పుడు.. దానికి కొనసాగింపు ప్రకటనలు చేస్తున్నారు. ఎంఐఎంను ప్రధానంగా టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ రాజకీయలాభాలను పొందుతోంది. దాని కోసం వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తోంది. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని ప్రభుత్వ రికార్డులు కూడా చెబుతున్నాయి. ఇది బీజేపీకి మరింత బలాన్ని స్తోంది. ఈ దూకుడును మరింతగా కొనసాగించాలని
అనుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close