క్రైమ్ : ప్రియుడి మోజు.. కాబోయే వాడి హత్య..!

ప్రియుడి మోజులో భర్తను అడ్డు తొలగించుకున్న భార్య లాంటి క్రైమ్ స్టోరీస్ చాలా జరిగాయి. జరుగుతూ ఉంటాయి. అయితే.. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లు.. పెళ్లిచేసుకునే వరకూ ఆగడం లేదు. పెళ్లి చేసుకోబోయేవాడ్ని కూడా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. హతుడు.. ఓ అమ్మాయిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుందామని.. అనుకున్నాడు.. కానీ.. చివరికి ఆ అమ్మాయి చేతిలో పెళ్లి కాకుండానే పరలోకానికి పోతానని ఊహించలేకపోయాడు. అమ్మాయి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న మైనర్. హత్యలో ఆమెకు సహకరించిన వారు.. తోటి విద్యార్థులు. వారిలో ఒకరు ఆమెను ప్రేమించిన వారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుతున్న యువతికి తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. అయితే..వరుడు గఫార్ బేగ్ హఠాత్తుగా హత్యకు గురయ్యాడు. ఎవరితోనూ వివాదాల్లేని యువకుడ్ని ఎవరు చంపారా అని పోలీసులు ఆరా తీస్తే సంచలన విషయాలు బయట పడ్డాయి. పెళ్లి చేసుకోబోయే అమ్మాయే మాస్టర్ ప్లాన్ రూపొందించించి హత్య చేయించిందని గుర్తు పెట్టారు. పెళ్లి ఇష్టం లేని యువతి తన బాయ్ ఫ్రెండ్ అతని మిత్రులతో కలిసి హత్య చేయించింది.

కాబోయే భర్తను ఎలాగైనా అంతమొందించాలనుకున్న ఆమె అతనికి, కుటుంబ సభ్యులకు ఏమాత్రమూ అనుమానం రాకుండా పది రోజులుగా రోజూ ఫోన్‌లో ప్రేమగా మాట్లాడేది. అది ప్రేమ అనుకుని నమ్మాడు గఫార్ బేగ్‌. శనివారం ఫోన్ చేసిన యువతి .. ఇంట్లో ఎవరూ లేరు.ఇంటికి రా అంటూ నమ్మ బలికింది. కాబోయే భార్య పిలిచింది కదా అని అతను ముందూ వెనుక చూసుకోకుండా వెళ్లిపోయాడు. అప్పటికే ఆ యువతి ప్రియుడు, మరో యువకుడు బైక్‌ను అటకాయించి దాడి చేశారు. అంతలోపే వెనుక నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కలిసి అతన్ని కత్తులతో పొడిచి చంపారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. మృతుడి సెల్‌ఫోన్‌ కాల్ లిస్ట్ ఆధారంగా కూపీ లాగడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close