పవన్ దెబ్బకు సెలవులో తూ.గో జిల్లా ఎస్పీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తునిలోని దివీస్ పరిశ్రమను తరలించాలనే ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. అది కూడా.. ఆయన బయలుదేరడానికి కొద్ది గంటల ముందు. దీంతో వివాదం ఏర్పడింది. రాజకీయ కారణాలతోనే ఇలా చేశారని.. తాము పర్యటించి తీరుతామని.. ఏం చేసుకుంటారో.. చేసుకోండన్నట్లుగా… జనసేన నేతలు ప్రకటనలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ కూడా.. తాను వస్తున్నానని.. ఒకే ఒక్క వాక్యంతో తేల్చేశారు.దీంతో పోలీసుల్లో టెన్షన్ ప్రారంభమయింది. ఇప్పటికే..విపక్ష నేతల మీద పోలీసుల ప్రయోగం అధికంగా ఉందని.. హక్కుల్ని హరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో.. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటే అది మరింత వివాదానికి దారి తీసే పరిస్థితి ఉంది. జనసైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి… పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా… భారీ సభను విజయవంతం చేస్తారు. అప్పుడు కేసులు పెట్టాల్సి వస్తుంది. అదే జరిగితే.., మరింత రాజకీయ రచ్చ అవుతుంది. ఈ పరిణామాలన్నింటితో… పర్మిషన్ ఇవ్వడమే మంచిదని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మొదట అనుమతి నిరాకరించమని పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు… ఆ పని చేసిన ఉన్నతాధికారులు.. తర్వాత మళ్లీ… పర్మిషన్ ఇవ్వాలని సంకేతాలు రావడంతో హతాశులయ్యారు. ఈ వ్యవహారంతో… కంగారు పడ్డారో… ఏమో కానీ… పవన్ కల్యాణ్ పర్యటన పూర్తయ్యే వరకూ… రెండు రోజుల పాటు.. తాను సెలవులో వెళ్తున్నట్లుగా ఎస్పీ ప్రకటించారు.

పవన్ పర్యటనకు.. తన సెలవుకు సంబంధం లేదని… వ్యక్తిగత సెలవుపై వెళ్తున్నానని ఆయన చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు …రాజకీయ వ్యూహాలు అమలు చేయడమే పెద్ద టాస్క్‌గా మారిందన్న విమర్శలు పెరిగిపోతున్న సమయంలో పవన్ కల్యాణ్ టూర్ విషయంలో వ్యవహరించిన వైఖరి.. మరింత వివాదాస్పదమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close