మళ్లీ ఢిల్లీలో ఆర్థికశాఖ ఆఫీస్ ముందు బుగ్గన..!

ఓ వైపు అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి మీట నొక్కి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్న సమయంలోనే నిధుల కోసం.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో అధికారుల బృందంతో వాలిపోయారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు… మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం కానున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రావడం.. అప్పులు పుట్టే మార్గాలన్నీ మూసుకుపోవడం.. చెల్లింపుల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం… అత్యవసర నిధుల కోసం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో… అమ్మఒడి కోసం దాదాపుగా ఆరు న్నర వేల కోట్లు పంపిణీచేయాల్సి ఉంది. అన్నీ ఒక్క సారే పంపిణీ చేసే పరిస్థితి లేదు. విడతల వారీగా.. నెలాఖరులోపు మొత్తం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కారణంగా… నిధులను సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే… బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారుల బృందంతో ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. మరో వైపు..బడ్జెట్ కసరత్తు కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది మరింత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఏపీ ప్రభుత్వం ఎదుర్కొనుంది. బడ్జెట్‌లో మరింత మెరుగైన ప్యాకేజీ పొందకపోతే… ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాలను కూడా… ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు బుగ్గన ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం చేసిన కొన్ని అప్పులను తిరిగి చెల్లించడం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అవి చెల్లించాలంటే.. మరింత ఆదాయ వనరు ఉండాల్సి ఉంది. అదే సమయంలో.., కోవిడ్ కారణంగా… ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని సవరించి ఎక్కువ రుణాలు తీసుకునే చాన్సిచ్చారు. వచ్చే ఏడాది ఆ చాన్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు.

అదే జరిగితే రుణసామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఈ కారణంగా బుగ్గన ముందు జాగ్రత్తగా..ఢిల్లీలో ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా తన పూర్తి సమయాన్ని నిధుల సమీకరణ కోసమే వచ్చిస్తున్నారు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉండి… కేంద్ర సాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కొసమెరుపేమిటంటే.. ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నా.. పోలవరానికి సంబంధించిన నిధులు.. ఎప్పుడో విడుదల చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించినా… ఇంత వరకూ విడుదల చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close