ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజల్ని మళ్లించడానికి పెట్రో ధరల పెంపా..!?

పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం రోజువారీగా పెంచుతోంది. అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధరలు పెరగకపోయినప్పటికీ.. దేశంలో మాత్రం.. ధరలు అసాధారణంగా పెంచుకుంటూ పోతున్నారు. గత రెండు రోజుల్లో.. లీటర్‌పై అరవై పైసల వరకూ పెరిగింది. లాక్ డౌన్ తర్వాత నుంచి కేంద్రం… ఇప్పటి వరకూ ఇరవై రూపాయల వరకూ వడ్డించింది. ఇంకా ఎంత పిండుతుందో తెలియని పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు 90 రూపాయలు దాటిపోయింది. ఏపీలో మద్యం అలవాటును తగ్గించడానికి.. మద్యం ధరలు పెంచినట్లుగా.. వాహన అలవాట్లను తగ్గించడానికి .. ఇలా ధరలు పెంచుతున్నారా అన్న చర్చను బీజేపీ అనుకూల మీడియా ప్రారంభింది.

ఎందుకంటే.. ఎలక్ట్రిన్ వాహనాల వైపు జనం మళ్లాలని.. ఇలా రేట్లు పెంచుతున్నారనే వాదనను తెరపైకి తేవడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఇంటర్నేషనల్ ధరలు, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రకారం ఇండియాలో ప్రతి రోజూ డీజిల్‌, పెట్రోల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మారుస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం.. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడల్లా పన్నులు పెంచుతోంది. ప్రస్తుతం లీటర ్పెట్రోల్‌ ధరలో వివిధ పన్నుల వాటా దాదాపు రూ. 55 వరకూ ఉంటుంది. కేంద్రం ఎక్సైజ్ ధర అంతకంతకూ పెంచుకుపోవడంతో.. ఏడాదికి కనీసం..మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఒక్క పెట్రోలియం ఉత్పత్తుల పై నుంచే వస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఇది రూ. 70వేల కోట్ల వరకే ఉండేది.

దీంతో.. కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయన్న కారణంగా… రేట్లు పెంచుతూనే ఉన్నారు కానీ.. ట్యాక్స్‌లు తగ్గించే ప్రయత్నం చేయడం లేదు. పైగా.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు .. పన్నులు బాదేస్తున్నామన్న కొత్త సంకేతాన్ని పంపుతున్నారు. వ్యతిరేకిస్తే దేశభక్తి లేదన్నట్లుగా కవరింగ్ ప్రారంభించే పరిస్థితి కూడా ఉండే అవకాశంఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close