అయోధ్య రామ మందిరానికి కో అంటే కోట్లు..!

అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు దేశం మొత్తం ప్రతి ఒక్క హిందువు గడప తొక్కి విరాళం అడగడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే కార్యక్రమం ప్రారంభమయింది. మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయని అయోధ్య రామాలయ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. పారిశ్రామిక వేత్తలో కోట్లలో ఇస్తున్నారు. ఇతర నేతలు లక్షల్లో ఇస్తున్నారు. అయోధ్య ఆలయం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. భక్తుల నుంచే సేకరిస్తున్నారు. దీని కోసమే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.

అయితే అయోధ్య అలయాన్ని కట్టాలనుకుంటే… మొత్తం భరించడానికి సిద్ధంగా ఉండే కార్పొరేట్ సంస్థలున్నాయి. మొత్తం కాకపోయినా… ఒక్కో విభాగాన్ని స్పాన్సర్ చేయడానికి కూడా….అనేక కార్పొరేట్ కంపెనీలు రెడీగా ఉన్నాయి. కానీ ఈ విషయంలో భక్తుల సెంటిమెంట్‌ను… అనుకూలంగా మార్చుకునే ఉద్దేశంతో… రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క హిందువు భాగస్వామ్యం అయ్యాడన్న సెంటిమెంట్ కల్పించే లక్ష్యంతో అందరి దగ్గరా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ నేతలకు ఇప్పటికే విరాళాల పుస్తకాలు చేరాయి. వాటితో.. వారు కొన్ని కోట్ల మంది హిందువుల గడపలను తొక్కి.. విరాళాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతానికి మూడు రోజుల్లోనే వంద కోట్లు వచ్చాయని చెబుతున్నప్పటికీ.. ముందు ముందు.. ఆ ఆలయానికి రూ. వెయ్యి కోట్లకుపైగా నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. దేశంలోని నలుమూలల నుంచి విరాళాలు వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో… దేశంలోనే ఆలయ నిర్మాణం కోసం అత్యధిక విరాళాలు పొందిన ఆలయంగా అయోధ్య రామాలయం చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ నిర్మాణం ప్రారంభమయింది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా.. నిర్మాణాన్ని పూర్తి చేసి.. కనీవినీ ఎరుగని రీతిలో వచ్చే ఎన్నికలకు ముందే ప్రారంభోత్సవం చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close