“సవాల్ పిటిషన్”లో తప్పులు.. వెనక్కిచ్చేసిన సుప్రీం..!

పంచాయతీ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఆవేశపడింది. ఆ ఆవేశంలో తప్పులు చేసింది. తప్పుల తడకగా సవాల్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటిషన్‌ను విచారణ క్రమంలో పెడదామనుకున్న సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి కూడా… ఆ పిటిషన్ ఏంటో అర్థం కాలేదు. వెంటనే… ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు ఆ పిటిషన్‌ను వెనక్కి ఇచ్చేశారు. పిటిషన్‌ను అర్థమయ్యేలా తప్పులు లేకుండా… మరోసారి దాఖలు చేయాలని సూచించారు. తప్పులు సరి చేయడానికి ఏపీ ప్రభుత్వ సీనియర్ లాయర్లు తంటాలు పడుతున్నారు. తప్పులు సవరించి మళ్లీ పిటిషన్ వేస్తే ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియని పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రకాల సమీకరణాల్ని లెక్కలోకి తీసుకుని .. పదుల సంఖ్యలో న్యాయవాదుల్ని నియమించుకుంది. ఢిల్లీలో ప్రత్యేకంగా పిటిషన్లు వేయడానికే న్యాయవాదులున్నారు. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా.. ఇప్పుడు అనధికారికంగా న్యాయవ్యవహారాలన్నీ చూస్తున్నారు. ఆయన కుమారుడు స్వయంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలో ఉన్నారు. ఇంత పకడ్బందీ యంత్రాంగం ఉన్నప్పటికీ.. ఓ పిటిషన్ ని తప్పుల తడకగా వేయడం ఏమిటన్నది వైసీపీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఉన్న పళంగా హైకోర్టు తీర్పును.. సుప్రీంకోర్టులో సవాల్ చేసి స్టే తీసుకు రాకపోతే.. నోటిఫికేషన్ విడుదలైపోతుంది. అది ఇరవై మూడునే తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇప్పటికే ఎస్‌ఈసీ షెడ్యూల్ ఇచ్చింది. దీని ప్రకారం.. ఆ షెడ్యూల్ వచ్చేస్తుంది. శనివారం ఆ షెడ్యూల్ వస్తే.. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా అలాంటి పిటిషన్‌ను అనుమతించదని పాత తీర్పులు చెబుతున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆపాలన్నా.. కొనసాగించాలన్నా.. అది ఎన్నికల కమిషన్ అధికారమే కానీ.. కోర్టులు ఎప్పుడూ జోక్యం చేసుకునే పరిస్థితి లేదు . దీంతో ఏపీలో ఎన్నికలు ఖాయమని చెప్పుకోవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close