ఏకగ్రీవాలు రద్దు చేయాలన్నదే విపక్షాల డిమాండ్.. !

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడాన్ని ఒక్క అధికార పార్టీ మినహా విపక్షాలన్నీ స్వాగతించాయి. అంతే కాదు పాత ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాయి. గతంలో పార్టీలతో ఎస్‌ఈసీ నిర్వహించిన సమావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమయింది. ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎస్ఈసీ గతంలో నోటిఫికేషన్ విడుదల కాని పంచాయతీ ఎన్నికలను మాత్రమే రీ షెడ్యూల్ చేసి పెడుతున్నారు. నామినేషన్ల వరకూ వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ల ఎన్నికల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వాయిదా వేసే వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియపై ఎస్‌ఈసీ సంతృప్తిగా లేరనే విషయం కేంద్ర హోంశాఖకు ఆయన రాసిన లేఖ ద్వారానే తేలిపోయింది. దాడులు , దౌర్జన్యాల ద్వారా అత్యధికంగా ఏకగ్రీవాలు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఏకపక్షంగా పని చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పుడు.. మళ్లీ ఆ ఎన్నికల గురించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే .. ఎస్‌ఈసీ ఆ ప్రక్రియ మొత్తం రద్దు చేసి మళ్లీ ఫ్రెష్‌గా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిపితే ఎస్‌ఈసీ అదే నిర్ణయం తీసుకుంటారని.. అందుకే సుప్రీంకోర్టుకు అయినా వెళ్లి స్టే తీసుకు రావాలని ప్రభుత్వం అనుకుంటోందంటున్నారు.

ఎన్నికలు జరిగితే స్వీప్ చేస్తామని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికలు జరగకుండానే స్వీప్ చేస్తారని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగి ప్రజలు ఓట్లేసి.. స్వీప్ చేయడం వేరు.. అసలు ఎన్నికలు జరగకుండా.. పోటీ దారులు లేకుండా చేసుకుని స్వీప్ చేయడం వేరు. ప్రభుత్వం రెండో దానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికలు జరగాలని… ప్రజలందరూ ఓట్లేయని విపక్షం కోరుకుంటోంది. మార్చి నెలాఖరులో పదవీ విరమణ చేయబోయే ఎస్‌ఈసీ ఎన్నికలన్నింటినీ నిర్వహించేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే జరిగితే.. వైసీపీ స్వీప్ చేసినా… ఎస్‌ఈసీచేతిలో ఓడిపోయినట్లే అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close